AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

75% స్థానికతపై ట్వీట్‌ వార్!

ఏపీలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి ఉద్యోగాలు తగ్గిపోతాయంటూ ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక కథనాన్ని వెలువరించింది. దీనివల్ల సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందని ఆ కథనంలో అభిప్రాయపడింది. రాజ్యాంగం దేశంలోని పౌరులందరూ ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించేందుకు, పనిచేసుకునేందుకు వీలు కల్పించిందని.. ఏపీ ప్రభుత్వం […]

75% స్థానికతపై ట్వీట్‌ వార్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 29, 2019 | 8:52 PM

Share

ఏపీలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి ఉద్యోగాలు తగ్గిపోతాయంటూ ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక కథనాన్ని వెలువరించింది. దీనివల్ల సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందని ఆ కథనంలో అభిప్రాయపడింది. రాజ్యాంగం దేశంలోని పౌరులందరూ ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించేందుకు, పనిచేసుకునేందుకు వీలు కల్పించిందని.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల పెట్టుబడులు, ఉత్పత్తిపై పెను ప్రభావం పడుతుందని ఆ కథనంలో పేర్కొంది. ఈ కథనాన్ని జత చేసి నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

దీనిపై ఏపీ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్‌ స్పందించారు. ‘‘మీ కామెంట్లు.. ఆ కథనం పూర్తిగా అసమగ్ర సమాచారంతో కూడినవి’’ అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీట్వీట్‌ చేశారు. స్థానికేతరులకు అవకాశాలు తగ్గించడం ద్వారా ఏపీలోని స్థానికులకు తగినన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. దీనిలో సమాఖ్య విధానాన్ని దెబ్బతీసే ఉద్దేశమేదీ లేదని పేర్కొన్నారు. దీనిపై అమితాబ్‌ కాంత్‌ స్పందిస్తూ ఇవి తన వ్యాఖ్యలు కావని.. ఆ పత్రిక కథనాన్ని మాత్రమే తాను పోస్ట్‌ చేసినట్లు రీట్వీట్‌ చేశారు.

Follow Us
కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం
ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం
తిరుమలలో ఇలాంటి పనులా? బిగ్‌బాస్ గీతూపై భక్తుల ఆగ్రహం.. వీడియో
తిరుమలలో ఇలాంటి పనులా? బిగ్‌బాస్ గీతూపై భక్తుల ఆగ్రహం.. వీడియో
వామ్మో.. బంగారం రూ.2లక్షలు.. వెండి రూ.4లక్షలు..?
వామ్మో.. బంగారం రూ.2లక్షలు.. వెండి రూ.4లక్షలు..?
దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం
దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం
నా డబ్బు నాకే అంటూ కోర్టులో గెలిచిన 10 ఏళ్ల కొడుకు
నా డబ్బు నాకే అంటూ కోర్టులో గెలిచిన 10 ఏళ్ల కొడుకు
March 2026 Horoscope: కెరీర్, మనీ విషయాల్లో వారికి అన్ని శుభాలే..
March 2026 Horoscope: కెరీర్, మనీ విషయాల్లో వారికి అన్ని శుభాలే..
టీ20 వరల్డ్ కప్ 2026లో మళ్లీ భారత్, పాక్ పోరు.. తేదీ, సమయం ఇదే..?
టీ20 వరల్డ్ కప్ 2026లో మళ్లీ భారత్, పాక్ పోరు.. తేదీ, సమయం ఇదే..?
భారతీయ బ్రాండ్ల జెండా ప్రపంచంపై ఎగరాలి.. సద్గురు కీలక సూచనలు..
భారతీయ బ్రాండ్ల జెండా ప్రపంచంపై ఎగరాలి.. సద్గురు కీలక సూచనలు..
ఆ హీరో యాక్టింగ్ సరిగ్గా చేయలేదు.. సినిమా ప్లాప్ అయ్యింది..
ఆ హీరో యాక్టింగ్ సరిగ్గా చేయలేదు.. సినిమా ప్లాప్ అయ్యింది..