AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM Jagan: సీతారామశాస్త్రి మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం.. ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటని ట్వీట్..

Sirivennela seetharama sastry death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సిరివెన్నెల మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని అన్నారు....

AP CM Jagan: సీతారామశాస్త్రి మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం.. ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటని ట్వీట్..
Sitharamasastri
Srinivas Chekkilla
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 30, 2021 | 6:08 PM

Share

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సిరివెన్నెల మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని అన్నారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అని.. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులుగా నిలిచి ఉంటాయని కొనియాడారు. ఆయన హఠాన్మరణం తెలుగువారికి తీరనిలోటని ట్వీట్ చేశారు . సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో న్యూమోనియాకు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నారు. ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సీతారామశాస్త్రిని సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయనకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‏ మరింత తీవ్రమవడంతో కన్నుమూశారు. ఆయన3000లకు పైగా సినీ పాటలు రాశారు. పదకొండు నంది అవార్డ్స్.. పద్మ శ్రీ అవార్డ్ అందుకున్నారు. సిరివెన్నెల మృతితో తెలుగు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

Read Also..Sirivennela Sitarama Sastri: జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి సిరివెన్నెల..