AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ప్రశాంత్ కిషోర్.. బీజేపీకి ఊహించని షాక్!

బీహార్‌‌లో జేడీయూ ఉపాధ్యక్షుడు, సీఎం నితీష్ కుమార్‌కు నమ్మిన బంటు, మాజీ ప్రచార వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ అత్యంత ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ఈయన ఒక్కరే కాదు.. బీహార్‌కు చెందిన కన్హయ్య కుమార్ ‌కూడా ఫోర్బ్స్ టాప్ 20 జాబితాలో పేరు సంపాదించారు. అంతేకాకుండా ఈ దశాబ్దపు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యక్తి కానున్నారని మ్యాగ్‌జైన్ పేర్కొంది. 2009లో ప్రశాంత్ కిషోర్ లైమ్ లైట్‌లో వచ్చారు. అప్పటి గుజరాత్ సీఎం.. ఇప్పటి ప్రధాని […]

'ఫోర్బ్స్' లిస్ట్‌లో ప్రశాంత్ కిషోర్.. బీజేపీకి ఊహించని షాక్!
Ravi Kiran
|

Updated on: Jan 08, 2020 | 7:37 PM

Share

బీహార్‌‌లో జేడీయూ ఉపాధ్యక్షుడు, సీఎం నితీష్ కుమార్‌కు నమ్మిన బంటు, మాజీ ప్రచార వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ అత్యంత ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ఈయన ఒక్కరే కాదు.. బీహార్‌కు చెందిన కన్హయ్య కుమార్ ‌కూడా ఫోర్బ్స్ టాప్ 20 జాబితాలో పేరు సంపాదించారు. అంతేకాకుండా ఈ దశాబ్దపు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యక్తి కానున్నారని మ్యాగ్‌జైన్ పేర్కొంది.

2009లో ప్రశాంత్ కిషోర్ లైమ్ లైట్‌లో వచ్చారు. అప్పటి గుజరాత్ సీఎం.. ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల వ్యూహరచన కోసం ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. ఇండియాలో ఫేస్‌బుక్‌లో ప్రచారాన్ని ప్రవేశపెట్టింది కూడా ప్రశాంత్ కిషోరే. ఇక ఆ తర్వాత అయన పంజాబ్ కాంగ్రెస్ లీడర్‌ అమరిందర్ సింగ్, ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో పని చేయడం జరిగింది.

ప్రస్తుతం 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్‌కు రాజకీయ వ్యూహకర్తగా పని చేయనున్న ప్రశాంత్ కిషోర్.. ఇండియాలోనే అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో ఒకరిగా ఫోర్బ్స్ సంస్థ గుర్తించడంతో బీజేపీకి ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఆదిత్య మిట్టల్, గోద్రేజ్ ఫ్యామిలీ, దుశ్యంత్ చౌతాలా, మాహూయ మొయిత్రా, గరిమా అరోరాలకు కూడా జాబితాలో చోటు దక్కింది.