టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ దాడులు చేస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

ఏపీలో వైసీపీపై బీజేపీ మాటల దాడిని పెంచింది. నిన్నటివరకూ టీడీపీ తరహాలోనే వైసీపీ దాడులు చేస్తోందని చెప్పిన ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఇప్పుడు టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ దాడులు చేస్తోందని అన్నారు. సీఎం జగన్ చెబుతున్న మాటలకు, క్షేతస్థాయిలో జరిగే పనులకు ఏ మాత్రం పొంతన లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీనే ప్రతిపక్షపార్టీ పోషిస్తోందని.. ఏపీలో 25లక్షల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకున్నామని.. జనసేన, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నుంచి కూడా కార్యకర్తలు పోటెత్తుతున్నారని […]

టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ దాడులు చేస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 15, 2019 | 9:12 PM

ఏపీలో వైసీపీపై బీజేపీ మాటల దాడిని పెంచింది. నిన్నటివరకూ టీడీపీ తరహాలోనే వైసీపీ దాడులు చేస్తోందని చెప్పిన ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఇప్పుడు టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ దాడులు చేస్తోందని అన్నారు. సీఎం జగన్ చెబుతున్న మాటలకు, క్షేతస్థాయిలో జరిగే పనులకు ఏ మాత్రం పొంతన లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీనే ప్రతిపక్షపార్టీ పోషిస్తోందని.. ఏపీలో 25లక్షల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకున్నామని.. జనసేన, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నుంచి కూడా కార్యకర్తలు పోటెత్తుతున్నారని అన్నారు. 2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కన్నా జోస్యం చెప్పారు.