AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్: వివేకా హత్య కేసు.. చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది. అలాగే అప్పటివరకు ఈ కేసులో సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయబోమన్న ఏజీ శ్రీరామ్‌ […]

షాకింగ్: వివేకా హత్య కేసు.. చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 09, 2020 | 2:45 PM

Share

మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది. అలాగే అప్పటివరకు ఈ కేసులో సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయబోమన్న ఏజీ శ్రీరామ్‌ హామీని హైకోర్టు నమోదు చేసుకుంది.

అయితే గతేడాది మార్చి 15న పులివెందులలోని స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు వైఎస్ వివేకా. మొదట ఆయన గుండెపోటుతో మరణించారని అనుకున్నప్పటికీ.. పోస్ట్‌మార్టంలో హత్యగా తేలింది. ఈ హత్య రాజకీయంగా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసుపై విచారణకు అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక సిట్‌‌ను ఏర్పాటు చేసింది. కానీ మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విచారణను మరో సిట్‌కు అప్పగించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 1400మందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారిలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్న విషయం తెలిసిందే.