సోమవారం రాత్రి చంద్రబాబు ఢిల్లీ పయనం!

సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపు సంఖ్యను పెంచాలన్న పిటిషన్‌పై మంగళవారం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో బాబు ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబుతో సహా బీజేపీయేతర పక్షాల నేతలు ఈ విషయంపై కోర్టులో హాజరుకానున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ల లెక్కింపును పునః పరిశీలించాలని సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రివ్యూ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులోనే వినాలని పిటిషనర్ల తరపున లాయర్ అభిషేక్ […]

సోమవారం రాత్రి చంద్రబాబు ఢిల్లీ పయనం!
Follow us

| Edited By:

Updated on: May 06, 2019 | 7:16 PM

సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపు సంఖ్యను పెంచాలన్న పిటిషన్‌పై మంగళవారం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో బాబు ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబుతో సహా బీజేపీయేతర పక్షాల నేతలు ఈ విషయంపై కోర్టులో హాజరుకానున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ల లెక్కింపును పునః పరిశీలించాలని సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రివ్యూ పిటిషన్‌ను ఓపెన్ కోర్టులోనే వినాలని పిటిషనర్ల తరపున లాయర్ అభిషేక్ మనుసింఘ్వి చీఫ్ జస్టిస్‌ను కోరారు. ఈ అభ్యర్థనను సీజే అంగీకరించడంతో ఈ వ్యవహారంపై బాబు సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు.