Andhra Pradesh: అయ్యో ఏంటీ ఈ ఘోరం.. అప్పుడే పుట్టిన శిశువుని సంచిలో కట్టి వదిలి వెళ్లిన తల్లి

అప్పుడే పుట్టిన శిశువులను ఎక్కడో ఓ చోట వదిలేసి వెళ్లిపోవడం, చెత్తకుప్పలో వేసేయడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని ఓ మాతృమూర్తి తనకు పుట్టిన మగ శిశువును సంచిలో కట్టి వదిలిపెట్టి వెళ్లడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణానికి వచ్చిన ఓ తల్లి తనకి అప్పుడే పుట్టిన ఓ మగశిశువును సంచిలో కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Andhra Pradesh: అయ్యో ఏంటీ ఈ ఘోరం.. అప్పుడే పుట్టిన శిశువుని సంచిలో కట్టి వదిలి వెళ్లిన తల్లి
Baby

Updated on: May 31, 2023 | 8:17 PM

అప్పుడే పుట్టిన శిశువులను ఎక్కడో ఓ చోట వదిలేసి వెళ్లిపోవడం, చెత్తకుప్పలో వేసేయడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని ఓ మాతృమూర్తి తనకు పుట్టిన మగ శిశువును సంచిలో కట్టి వదిలిపెట్టి వెళ్లడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణానికి వచ్చిన ఓ తల్లి తనకి అప్పుడే పుట్టిన ఓ మగశిశువును సంచిలో కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో రెవెన్యూ కార్యాలయ ఉద్యోగులు శిశువు ఏడుపును విన్నారు. వెంటనే ఆ శిశువును కాపాడి గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. వైద్యులు ఆ చిన్నారికి ప్రథమ చికిత్స అందించారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అయితే ఆ శిశువును అలా వదిలివెళ్లేసిన వారు ఎవరూ.. ఎందుకు అలా చేశారు అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Loading...
Unable to load recommendations.
Follow Us