AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం రెండో బిడ్డకు జననం.. సాయంత్రం మొదటి బిడ్డ మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు!

సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఓ మహిళ ఉదయం రెండో బిడ్డకు జన్మనివ్వగా అదే రోజు సాయంత్రం ఆమె మొదటి బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండికి చెందిన ప్రసాద్, అంజలి దంపతులు రెండో బిడ్డ పుట్టగా అదే రోజు సాయంత్రం వారి 8 ఏళ్ల కుమారుడు దిలీప్ చెరువులో మునిగి చనిపోయాడు. దీంతో ఓ బిడ్డకు నమ్మనిచ్చామని కాస్త సంతోషం కూడా ఆ తల్లిదండ్రుల దక్కకుండా పోయింది.

ఉదయం రెండో బిడ్డకు జననం.. సాయంత్రం మొదటి బిడ్డ మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు!
Sathyasai
Nalluri Naresh
| Edited By: Anand T|

Updated on: Jun 12, 2025 | 9:57 PM

Share

ప్రసాద్, అంజలి దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వగా అదే రోజు సాయంత్రం వారి మొదటి బిడ్డ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండికి చెందిన ప్రసాద్, అంజలి దంపతులకు 10 సంవత్సరాల క్రితం పెళ్లయింది. ప్రసాద్, అంజలి దంపతుల 8 ఏళ్ల కుమారుడు దిలీప్ ఉన్నారు. అయితే ప్రసాద్‌ భార్య ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పండంటి బిడ్డను జన్మనిచ్చామనే ఆనందం ఆ దంపతులలో ఎక్కువ సేపు నిలువ లేక పోయింది. ఆ రోజు సాయంత్రంలోపే ఆ దంపతులు సంతోషం ఆవిరైపోయింది.

వీడిచె చూడండి..

ప్రసాద్, అంజలి దంపతుల మొదటి కుమారుడైన దిలీప్ అదే రోజు సాయంత్రం చెరువులో పడి మరణించడం ఆ కుటుంబంతో తీవ్ర విషాదాన్ని నింపింది. అమ్మమ్మ బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లగా.. ఆమె వెనకే వెళ్లిన దిలీప్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఉదయం రెండో బిడ్డకు జన్మనిచ్చి.. సాయంత్రానికి మొదటి బిడ్డ చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ వైపు బిడ్డ పుట్టాడన్న సంతోషం.. మరోవైపు ఇంకో బిడ్డ మరణించాడు అన్న విషాదంతో కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు వినిపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..