AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మాకు మలేరియా నివారణ మందు ఇవ్వండి’.. మోదీకి ట్రంప్ విజ్ఞప్తి

కరోనా రోగుల చికిత్సలో వాడే మలేరియా నివారణ మందు..' హైడ్రాక్సీక్లోరోక్విన్' ను తమ దేశానికి ఇవ్వవలసిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని కోరారు. ఈ విషయమై మోదీతో మాట్లాడానని...

'మాకు మలేరియా నివారణ మందు ఇవ్వండి'.. మోదీకి ట్రంప్ విజ్ఞప్తి
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 05, 2020 | 11:25 AM

Share

కరోనా రోగుల చికిత్సలో వాడే మలేరియా నివారణ మందు..’ హైడ్రాక్సీక్లోరోక్విన్’ ను తమ దేశానికి ఇవ్వవలసిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని కోరారు. ఈ విషయమై మోదీతో మాట్లాడానని, దీన్ని మనదేశానికి అందజేసే అంశాన్ని ఇండియా తీవ్రంగా పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. వైట్ హౌస్ లో కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యులతో మాట్లాడిన ఆయన.. తను కూడా ఈ టాబ్లెట్ ను వాడుతానని నిర్మొహమాటంగా చెప్పారు. ఈ మందు ఎగుమతిపై ఇండియా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరానన్నారు. డాక్టర్ల సలహాపై నేను కూడా ఈ మందు వాడతానని ట్రంప్ మళ్ళీ చెప్పారు .. ఇండియాలో ఈ మందు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కోట్లాది ప్రజలకు ఈ మందుతో అవసరం ఏర్పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. మనం ఆర్డర్ చేసిన ఈ మెడిసిన్ ను భారత్ త్వరగా విడుదల చేస్తే నేనెంతో సంతృప్తి చెందుతాను అని కూడా అన్నారు. కాగా ఈ విషయమై ఫోన్ లో తామిద్దరం ఆత్మీయంగా మాట్లాడుకున్నామని, కరొనాను ఎదుర్కొనేందుకు భారత, అమెరికా దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని కోరానని ప్రధాని మోదీ తెలిపారు. అమెరికాలో కరోనా మృతులకు మోదీ తీవ్ర సంతాపం తెలిపారు.

ఆదివారం నాటికి ఆ దేశంలో 3 లక్షల 1902 కరోనా కేసులు నమోదు కాగా.. 8,175 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో 23,949 కేసులు నమోదయ్యాయి . అలాగే తాజాగా.. వెయ్యిమందికి పైగా మృతి చెందారు. ఒక అగ్ర రాజ్యం కరోనా కారణంగా మలేరియా నివారణ మందు కోసం ఇండియా వంటి వర్ధమాన దేశాన్ని కోరడం విశేషం.