AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“అప్పటికే 7 ఫైటర్ జెట్స్‌ను కూల్చేశారు.. నేను లేకుంటే పెద్ద యుద్ధమే జరిగేదీ”: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించానని పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ట్రంప్, సుంకాలను ఆయుధంగా ఉపయోగించడం ద్వారా రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని నిరోధించానని అన్నారు. ఈ యుద్ధంలో ఏడు అత్యాధునిక విమానాలను కూల్చివేసినట్లు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.

అప్పటికే 7 ఫైటర్ జెట్స్‌ను కూల్చేశారు.. నేను లేకుంటే పెద్ద యుద్ధమే జరిగేదీ: ట్రంప్
Donald Trump
Balaraju Goud
|

Updated on: Oct 28, 2025 | 11:17 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించానని పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ట్రంప్, సుంకాలను ఆయుధంగా ఉపయోగించడం ద్వారా రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని నిరోధించానని అన్నారు. ఈ యుద్ధంలో ఏడు అత్యాధునిక విమానాలను కూల్చివేసినట్లు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. అయితే, ఎప్పటిలాగే, ఏ దేశ విమానాలను కూల్చివేసారో ఆయన పేర్కొనలేదు.

జపాన్‌లో అమెరికా సైనికులను ఉద్దేశించి డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, “దేశ జాతీయ భద్రత దృష్ట్యా అన్ని యుద్ధాలు అన్నీ సుంకాల కారణంగానే జరిగాయి. వాణిజ్యం, సుంకాల ద్వారా ప్రపంచానికి గొప్ప సేవ చేశాను. భారత్, పాకిస్తాన్‌లను పరిశీలిస్తే, ఆ సమయంలో వారు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు” అని అన్నారు. “రెండు యుద్ధానికి వెళితే, ఎటువంటి వ్యాపారం చేయము” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ సైనిక అధిపతికి స్పష్టంగా చెప్పానని ట్రంప్ పేర్కొన్నారు. ఆ సమయంలో, రెండు అణ్వాయుధ దేశాలు ఒకదానికొకటి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. “ఏడు ఫైటర్ జెట్స్ కాల్చివేశారు” అని అమెరికా అధ్యక్షుడు అన్నారు. తన కఠినమైన హెచ్చరిక తర్వాతే పరిస్థితి అదుపులోకి వచ్చిందని గొప్పలు పలికారు.

‘నాకు నోబెల్ శాంతి బహుమతి రావాల్సి ఉంది ‘ అని ట్రంప్ అన్నారు. ప్రపంచంలోని ఎనిమిది ప్రధాన సంఘర్షణలను సుంకాల విధానం ద్వారా పరిష్కరించానని, భారతదేశం-పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడంలో ఎంతో కృషికి నోబెల్ శాంతి బహుమతి రావాలని ఆయన అన్నారు. ‘ఆ సమయంలో చర్యలు తీసుకోకపోతే, ఒక పెద్ద యుద్ధం జరిగి ఉండేది’ అని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, డొనాల్డ్ ట్రంప్ వాదనను భారతదేశం నిరంతరం తిరస్కరిస్తూనే ఉంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించే నిర్ణయం రెండు దేశాల మధ్య ప్రత్యక్ష దౌత్య సంబంధాల ద్వారా తీసుకోవడం జరిగింది. దానిలో మూడవ పక్షం పాత్ర లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us