AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plane Crash: ఢీకొన్న వాయుసేన విమానాలు.. ముగ్గురు మృతి

Plane Crash: రెండు వాయుసేన విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు(Dead). ఒకరికి తీవ్ర గాయాలు కావటంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Plane Crash: ఢీకొన్న వాయుసేన విమానాలు.. ముగ్గురు మృతి
Plane Crash
Ayyappa Mamidi
|

Updated on: Apr 01, 2022 | 1:44 PM

Share

Plane Crash: రెండు వాయుసేన విమానాలు ఢీకొన్న ఘటన సౌత్ కొరియాలో(South Korea) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు(Dead). ఒకరికి తీవ్ర గాయాలు కావటంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన తర్వాత సచియాన్​ నగరానికి సమీపంలోని లోయ ప్రాంతంలో ఈ విమానాలు కూలినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలతో పాటు కొంతమంది సిబ్బందిని అధికారులు ప్రమాద స్థలానికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల ఘటనాస్థలం వద్ద ఎవరైనా స్థానికులు ప్రాణాలు కోల్పోయారా అనే విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.

KT-1 మోడల్​కు చెందిన ఈ విమానాలను శిక్షణ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. శిక్షణా సమయంలో గాల్లో చెక్కర్లు కొడుతున్న సమయంలో ప్రమాదం సంభవించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మోడల్ విమానాల్లో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. అసలు ప్రమాదానికి కారణం ఏమిటి అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ తరుణంలో ఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు వాయుసేన తన దర్యాప్తును కొనసాగిస్తోంది. దీని వెనుక సాంకేతిక కారణాలు ఉన్నాయా లేక ఇతర కారణాల వల్ల ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ప్రమాదానికి ముందు జనవరిలో కూడా దక్షిణ కొరియా వాయుసేనకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. గతంలో F​-5E రకానికి చెందిన విమానం కొండను ఢీకొనడం వల్ల పైలట్​ ప్రాణాలు కోల్పోయాడు. వరుస ప్రమాదాలను సీరియస్ గా తీసుకున్న సౌత్ కొరియన్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సాంకేతిక సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి..

Market News: నెల ఆరంభంలో పాజిటివ్ గా ప్రారంభమైన సూచీలు.. స్వల్ప లాభాల మధ్య సాగుతున్న ట్రేడ్..

Mahindra: నూతన సాంకేతికతలోకి అడుగుపెట్టిన మహీంద్రా గ్రూప్.. ఆనంద్ మహీంద్రా ప్రకటన..

Follow Us
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు