
ఆర్థిక వ్యవస్థను తొక్కేస్తే చాలు.. ఏ దేశమైనా తన కాళ్లబేరానికి వచ్చేస్తుంది. ట్రంప్ అనే కాదు.. అమెరికా పాలసీనే అలా ఉంటుంది కాబోలు. ట్రంప్ అస్త్రం కూడా ఇదే. భారత్కు డాలర్ల అవసరం చాలా ఉంది. ఎప్పుడూ ఉంటుంది. ఎంత ఎక్స్పోర్ట్స్ పెరిగితే అన్ని డాలర్లు. సరిగ్గా దానిపైనే దెబ్బేశారు ట్రంప్. టారిఫ్లను భరించలేని స్థాయికి పెంచారు. ఇండియాకు ఎక్కువ డాలర్లు తెచ్చిపెట్టే సెక్టార్.. ఐటీ. ఆ రంగాన్ని చావుదెబ్బ కొట్టాలనుకుంటున్నారు. అమెరికాకు ఎక్కువగా వచ్చే విదేశీయుల్లో ఫస్ట్ ప్లేస్.. ఇండియన్స్. వాళ్లే భారత్కు డాలర్స్ పంపిస్తుంటారు. చివరికి వారిని కూడా టార్గెట్ చేశారు. ఇలా అష్టదిగ్భందనం చేసి ఊపిరాడకుండా చేయాలనేదే ట్రంప్ ప్లాన్. ట్రంప్ ప్రయోగించబోయేది నిజంగా ఓ బ్రహ్మాస్త్రమే. ఒకసారి వదిలితే ఇక తిరుగుండదంతే. టార్గెట్ను ఛేజ్ చేసి తీరుతుంది. ఇంతకీ ఏంటా బ్రహ్మాస్త్రం అంటే.. అమెరికన్ కంపెనీలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందించేవి మోస్ట్లీ మన భారత ఐటీ కంపెనీలే. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీలో ఉన్న కంపెనీలు, అందులో ఉండే లక్షల మంది ఐటీ ఉద్యోగులు చేసే పని.. ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్ కంపెనీలకు ఐటీ సర్వీసెస్ అందించడమే. అమెరికాలో నడుస్తున్న బ్యాంకులు, హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, షాపింగ్ మాల్స్, చివరకు కాఫీ షాప్స్కు కూడా సాఫ్ట్వేర్ అవసరం. వాటికి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తున్నది ఎక్కువగా మన భారతీయ కంపెనీలే. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో,...