AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nepal: నేపాల్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై బ్యాన్‌ ఎత్తివేత.. హోంమంత్రి రాజీనామా

నేపాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై బ్యాన్‌ ఎత్తివేసింది. అత్యవసర భేటీలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా యాప్స్‌పై వారం క్రితం నిషేధం విధించింది నేపాల్‌ ప్రభుత్వం.. దీంతో యువత Gen-z పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది.

Nepal: నేపాల్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై బ్యాన్‌ ఎత్తివేత.. హోంమంత్రి రాజీనామా
Nepal Violence
Shaik Madar Saheb
|

Updated on: Sep 09, 2025 | 7:15 AM

Share

నేపాల్ అట్టుడుకుతోంది.. సోషల్‌ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు Gen-z పేరుతో అవినీతి వ్యతిరేక పోరాటంగా మారింది. ప్రధాని ఓలి తీరును తప్పుబడుతున్న ఆందోళనకారులు… సోషల్‌ మీడియాపై బ్యాన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటు జర్నలిస్టు సంఘాలు సైతం ఆందోళన బాట పట్టాయి. ఇక పరిస్థితిని అదుపు చేయడానికి నేపాల్‌ రాజధాని ఖాట్మండు సహా 10 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. నేపాల్‌లో జరిగిన Gen Z ఆందోళనల్లో ఇప్పటివరకు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలోనే.. నేపాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై బ్యాన్‌ ఎత్తివేసింది. అత్యవసర భేటీలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ నిర్ణయం తీసుకున్నారు.

నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా యాప్స్‌పై వారం క్రితం నిషేధం విధించింది నేపాల్‌ ప్రభుత్వం.. దీంతో యువత Gen-z పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. కాఠ్మాండులో జరిగిన ఆందోళనల్లో హింస చెలరేగింది. వేలాదిమంది యువకులు నేపాల్‌ పార్లమెంట్‌ భవనాన్ని ముట్టడించారు. దీంతో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతి చెందగా.. 300 మందికి పైగా గాయాలయ్యాయి.. కాగా.. అల్లర్లకు బాధ్యత వహిస్తూ నేపాల్‌ హోంమంత్రి రమేష్‌ లేఖక్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రధానికి అందజేశారు రమేష్ లేఖక్..

చివరకు ఆందోళనలకు తలొగ్గిన నేపాల్‌ సర్కార్‌ సోషల్‌ మీడియాపై నిషేధం ఎత్తివేసింది. అయినప్పటికీ.. ఆందోళనకారులు తలొగ్గడం లేదు.. ప్రధాని ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వృద్ధ నాయకత్వం దిగిపోవాలని పోరాటం చేస్తున్నారు. కాగా.. ఈ ఆందోళనల వెనుక విదేశీ కుట్ర ఉందని నేపాల్‌ ప్రభుత్వం పేర్కొంటోంది.

యువత ఆక్రోశం..

కాగా.. నేపాల్‌ పార్లమెంట్‌ ప్రాంగణంలో యువత చేస్తున్న రచ్చ..కుర్రాళ్ల ఆక్రోశాన్ని చూసి పోలీసులే ఎదురెళ్లడానికి వణికిపోయారు.. ఒక్కసారిగా వేలాది మంది రావడంతో చేతులెత్తారు. ఫలితంగా పార్లమెంటులోకి దూసుకెళ్లి మరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాస్థిని ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టాల్సిన పోలీసులే తమని తాము రక్షించుకోవడానికి చచ్చి బ్రతికారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. బారికేడ్లు పెట్టినా, బాష్పవాయువు ప్రయోగించినా, వాటర్‌ కెనాన్స్‌తో విరుచుకుపడ్డా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. దారి పొడుగునా ఉన్నా వాహనాలను తగులబెట్టుకుంటూ పోయారు. ప్రజాప్రతినిధుల కార్లకు నిప్పంటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కనురెప్పలు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
కనురెప్పలు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
ఆందోళన వద్దు.. దేశంలో ఇంధన, ఎరువు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి-కేందం
ఆందోళన వద్దు.. దేశంలో ఇంధన, ఎరువు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి-కేందం
వరుసగా రోడ్డెక్కుతున్న ఆక్వా రైతులు. ఈ పరిస్థితికి కారణమేంటి..?
వరుసగా రోడ్డెక్కుతున్న ఆక్వా రైతులు. ఈ పరిస్థితికి కారణమేంటి..?
హెన్నా నేచురల్ అని ఇష్టమొచ్చినట్లు వాడుతున్నారా?నష్టం తెలిస్తే..
హెన్నా నేచురల్ అని ఇష్టమొచ్చినట్లు వాడుతున్నారా?నష్టం తెలిస్తే..
హైదరాబాదీలకు అలర్ట్.. వాటర్ ట్యాంక్‌ బుకింగ్‌ సేవల్లో అంతరాయం
హైదరాబాదీలకు అలర్ట్.. వాటర్ ట్యాంక్‌ బుకింగ్‌ సేవల్లో అంతరాయం
ఒక చెంచా నెయ్యి తింటే ఎన్ని క్యాలరీలు పెరుగుతాయి? బరువు తగ్గాలని.
ఒక చెంచా నెయ్యి తింటే ఎన్ని క్యాలరీలు పెరుగుతాయి? బరువు తగ్గాలని.
గిరిజన విద్యార్థులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూక్
గిరిజన విద్యార్థులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూక్
చపాతీ, రొట్టెల్లోకి అదిరిపోయే అలసందల కూర..
చపాతీ, రొట్టెల్లోకి అదిరిపోయే అలసందల కూర..
ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. కన్నీరు పెట్టిన వైభవ్
ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. కన్నీరు పెట్టిన వైభవ్
CBSE మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టు కీలక విచారణ..
CBSE మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టు కీలక విచారణ..