AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Support to India: త్రివర్ణంతో మెరిసిపోయిన అబుదాబీలోని యాస్ ద్వీపం..కష్ట సమయంలో వారిచ్చిన మద్దతుకు నెటిజనం ఫిదా!

బుర్జ్ ఖలీఫా అలాగే, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ప్రధాన కార్యాలయాలతో సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని ప్రముఖ భవనాలు ముఖ్య ప్రదేశాలు త్రివర్ణంతో వెలిగిపోయాయి.

Support to India: త్రివర్ణంతో మెరిసిపోయిన అబుదాబీలోని యాస్ ద్వీపం..కష్ట సమయంలో వారిచ్చిన మద్దతుకు నెటిజనం ఫిదా!
Abu Dhabi
KVD Varma
|

Updated on: Apr 27, 2021 | 6:35 PM

Share

Support to India: ఈ సంవత్సరం కరోనావైరస్ మహమ్మారి చెత్త దశతో భారతదేశం పోరాడుతుండగా, ఈ సంక్షోభ సమయంలో ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు సహా వైద్య సామాగ్రితో దేశానికి సహాయం చేయడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చింది. ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి, బుర్జ్ ఖలీఫా అలాగే, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ప్రధాన కార్యాలయాలతో సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని ప్రముఖ భవనాలు ముఖ్య ప్రదేశాలు త్రివర్ణంతో వెలిగిపోయాయి.

అబుదాబి లోని యాస్ ద్వీపం మువ్వన్నెలతొ వెలిగిపోయింది. ఇది అక్కడి ఒక ప్రత్యేకమైన అలాగే ప్రధానమైన వినోద పర్యాటక కేంద్రం. ద్వీపం మొత్తం భారతావనికి మద్దతుగా భారతీయ జెండా రంగులతో దీపాల్ని వెలిగించారు. బుర్జ్ ఖలీఫా వెలుగుల్ని ఇంతకు ముందు చూశాం. ఇప్పుడు ఈ ద్వీపంలో వెలుగుల్ని చూసిన తరువాత మరింత ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ఫోటోలను ఇండియా ఇన్ యుఎఇ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. దీంతో ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు భారతదేశానికి వెలుగుల మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. యాస్ ద్వీపంలోని ప్రతి భవనం త్రివర్ణాలతో సుందరంగా కనిపిస్తున్నాయి. భారతదేశం కోవిడ్ పై చేస్తున్న యుద్ధంలో గెలుపు సాధించాలని కోరుతూ ఈ ఏర్పాటు చేశారు. తమ మద్దతు భారతదేశ ప్రజలకు ఎప్పుడూ ఉంటుంది. ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఇండియా ఇన్ యూఏఈ ”మేము మా స్నేహితుడికి ధన్యవాదాలు” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫోటోలతో పాటు క్యాప్షన్ కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఇండియాలో కరోనా కేసుల భారీ పెరుగుదల నుంచి బయటపడుతున్నట్టు కనిపిస్తున్నా..ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు దాదాపు పతనం అంచున ఉన్నాయి. ఇక, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన డేటా ప్రకారం, గత 24 గంటల్లో భారతదేశం 3.23 లక్షలకు పైగా కొత్త కోవిడ్ -19 కేసులు, 2,771 మరణాలను నమోదు చేసింది. యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా అనేక దేశాలు భారతదేశానికి వైద్య సహాయంలో భాగంగా వెంటిలేటర్లు మరియు ఆక్సిజన్ సాంద్రతలను పంపించాయి.

Also Read: Telangana Corona: తెలంగాణలో కరోనా చర్యలపై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి ఈటల రాజేందర్‌

Election Commission: ఆత్మావలోకనంలో కేంద్ర ఎన్నికల సంఘం? చివరి అంకంలో దిద్దుబాటు చర్యలు!

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు