US on India: రష్యాకు మద్దతు ఇస్తే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. భారత్‌‌ను మరోసారి అమెరికా హెచ్చరిక!

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరి అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా తీరును వ్యతిరేకిస్తూ పలు ఆంక్షలు విధించిన అమెరికా.. మరోసారి భారతదేశం తీరును తప్పుబట్టింది.

US on India: రష్యాకు మద్దతు ఇస్తే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. భారత్‌‌ను మరోసారి అమెరికా హెచ్చరిక!
Brian Deese

Updated on: Apr 07, 2022 | 9:01 AM

US on India: రష్యా ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) నేపథ్యంలో భారత దేశం(India) తటస్థ వైఖరి అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా తీరును వ్యతిరేకిస్తూ పలు ఆంక్షలు విధించిన అమెరికా.. మరోసారి భారతదేశం తీరును తప్పుబట్టింది. రష్యాతో పొత్తు పెట్టుకోవద్దని భారత్‌ను హెచ్చరించిందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌(Joe Biden)కు అత్యున్నత ఆర్థిక సలహాదారు బ్రియాన్ డీస్(Brian Deese) తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత భారత్ ఇచ్చిన కొన్ని ప్రతిస్పందనలపై అమెరికా అధికారులు తీవ్ర నిరాశకు గురయ్యారని ఆయన చెప్పారు. వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ బ్రియాన్ డీజ్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి చైనా భారత్ రెండూ తీసుకున్న నిర్ణయాల వల్ల మేము నిరాశకు గురయ్యామని అన్నారు.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, బ్రియాన్ డీజ్ మీడియాతో మాట్లాడుతూ, రష్యాతో వ్యూహాత్మక కూటమిగా దీర్ఘకాలికంగా భారత్ ఉంటుందని అమెరికా తెలిపింది. వాస్తవానికి, ఉక్రెయిన్‌పై యుద్ధం చేసిన తర్వాత అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ రష్యాపై ఆర్థిక ఆంక్షల వర్షం కురిపించాయి. అదే సమయంలో, భారతదేశం అలా చేయలేదు. బదులుగా రష్యా నుండి నిరంతరం చమురును దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం పట్ల భారత్ అవలంబిస్తున్న వైఖరి అమెరికాతో సంబంధాలను దెబ్బతీస్తోంది. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి, ఎదుర్కోవడానికి అమెరికాకు భారతదేశం ప్రధాన భాగస్వామిగా పరిగణించడమే దీని వెనుక కారణం.

బిడెన్ ఆర్థిక సలహాదారు బ్రియాన్ డీస్ తాజాగా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చిచనీయాంశంగా మారింది. మరోవైపు US డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దలీప్ సింగ్ గత వారం భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా భారత అధికారులు, నాయకులతో సమావేశమైన సమయంలోనూ ఇదే అంశానికి సంబంధించి కీలక ప్రకటన చేశారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి ఈ వారం ప్రారంభంలో చెప్పారు. రష్యా ఇంధనం, ఇతర వస్తువుల దిగుమతులను వేగవంతం చేయడానికి లేదా పెంచడానికి భారతదేశం ఆసక్తిని మేము విశ్వసించడం లేదు. అయితే ఈ విషయంపై భారత్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

బుధవారం రష్యాపై కొత్త ఆంక్షల గురించి అమెరికా అధికారి మాట్లాడుతూ, అమెరికా సహా మిగిలిన ఏడు దేశాల సమూహం భారతదేశానికి సహకరిస్తూనే ఉంటాయని చెప్పారు. ఆహార భద్రత, ప్రపంచ ఇంధనంపై భారతదేశం – యుఎస్ పరస్పరం విస్తృతంగా సహకరించుకుంటున్నాయని ఆయన తెలిపారు. రష్యా నుంచి చమురు తీసుకోవడమే కాకుండా రష్యా ఆయుధాలను ఎక్కువగా కొనుగోలు చేసే దేశం భారత్. ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం ఖరీదు కాబట్టి పాకిస్థాన్, చైనాలను ఎదుర్కోవడానికి రష్యా ఆయుధాలు అవసరమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.

Read Also…  Petrol Price Today: వాహనదారులకు కాస్త ఊరట.. స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. అక్కడ మాత్రం పెరుగుదల.

Loading...
Unable to load recommendations.
Follow Us