ప్రతీకార దాడులతో రెచ్చిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ను ఛేదించామని ప్రకటన..!
ఇవాళ కూడా మిడిల్ ఈస్ట్ యుద్ధం భీకరంగా నడుస్తోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులతో మరింత వేడెక్కింది పశ్చిమాసియా. తాము తల్చుకుంటే ఇజ్రాయెల్ని తీవ్రంగా దెబ్బతీయగలమన్న సంకేతాలు ఇస్తోంది ఇరాన్. ఇప్పటికే 4వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటిష్ ఇండియన్ ఐల్యాండ్ డీయాగో గార్సియాను టార్గెట్ చేసిన ఇరాన్.. ఇప్పుడు ఇజ్రాయెల్లోని కీలక స్థావరాలనూ కొట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది.

ఇవాళ కూడా మిడిల్ ఈస్ట్ యుద్ధం భీకరంగా నడుస్తోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులతో మరింత వేడెక్కింది పశ్చిమాసియా. తాము తల్చుకుంటే ఇజ్రాయెల్ని తీవ్రంగా దెబ్బతీయగలమన్న సంకేతాలు ఇస్తోంది ఇరాన్. ఇప్పటికే 4వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటిష్ ఇండియన్ ఐల్యాండ్ డీయాగో గార్సియాను టార్గెట్ చేసిన ఇరాన్.. ఇప్పుడు ఇజ్రాయెల్లోని కీలక స్థావరాలనూ కొట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇప్పటికైతే డిమోనా అణు పరిశోధనా కేంద్రం నుంచి ఎలాంటి రేడియేషన్ లీకేజీ లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ప్రకటించింది. అయితే శనివారం (మార్చి 21) ఇరాన్లోని నతాంజ్ అణుకేంద్రంపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే ఈ ఎటాక్స్ చేశామని ఇరాన్ ప్రకటించింది. కావాలనే పూర్తిగా టార్గెట్ చేయలేదని.. తాము దెబ్బతీయాలనుకుంటే ఇజ్రాయెల్లోని కీలక అణు స్థావరాలను లేపేయగలమన్న సందేశం ఇస్తోంది.
ఇజ్రాయెల్ నగరమైన డిమోనాపై శనివారం (మార్చి 21) ఇరాన్ భారీ క్షిపణి దాడి చేసింది. ఇజ్రాయెల్ అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం డిమోనాలోనే ఉంది. ఈ దాడి వల్ల నగరంలో తీవ్ర విధ్వంసం జరగ్గా, అనేక మంది గాయపడినట్లు సమాచారం. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి నుంచి వెలువడిన శకలాలు తగలడంతో దక్షిణ ఇజ్రాయెల్ నగరమైన డిమోనాలోని ఒక భవనం కూలిపోయింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అగ్నిమాపక, సహాయక బృందాలు ధృవీకరించాయి. నగరంలోని 12 వేర్వేరు ప్రాంతాల్లో అత్యవసర బృందాలు మృతుల కోసం గాలిస్తున్నాయి.
ప్రాథమిక కథనాల ప్రకారం, డిమోనాలో జరిగిన దాడిలో 20 మంది గాయపడ్డారు. ఒక క్లస్టర్ క్షిపణి, మరో బాలిస్టిక్ క్షిపణి ఆ ప్రాంతాన్ని తాకినట్లు సమాచారం. అయితే, భవనం నేరుగా తాకడం వల్ల కూలిందా లేక అడ్డగించిన క్షిపణుల శకలాల వల్ల కూలిందా అనేది స్పష్టంగా తెలియరాలేదు. అగ్నిమాపక, సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
నెగెవ్ ఎడారిలోని డిమోనా నగరాన్ని పదేపదే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సాగిస్తున్న నిరంతర క్షిపణి దాడులలో భాగంగానే ఆ నగరంపై ఈ దాడులు జరిగాయి. ప్రాథమిక సైనిక అంచనాల ప్రకారం, డిమోనా తోపాటు చుట్టుపక్కల పట్టణాలలో సైరన్లు మోగడానికి కారణమైన ఇరాన్ క్షిపణిని బహుశా అడ్డుకున్నారు. అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన ఐదవ దాడి ఇది.
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి అనంతరం డిమోనాలోని సంఘటనా స్థలానికి వైద్య, సహాయక బృందాలు చేరుకున్నాయి. దక్షిణ ఇజ్రాయెల్పై జరిగిన దాడులు, ఉత్తర ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ నుండి హిజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లతో ఏకకాలంలో జరిగాయి. దీంతో నహరియా చుట్టుపక్కల పశ్చిమ గలీలీ ప్రాంతంలో ఏకకాలంలో సైరన్లు మోగాయి.
ఈ సంఘర్షణలో డిమోనాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నగరం షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధనా కేంద్రానికి సమీపంలో ఉంది. ఈ కేంద్రమే ఇజ్రాయెల్ అప్రకటిత అణ్వాయుధ కార్యక్రమానికి కేంద్రంగా బావిస్తారు. ఇజ్రాయెల్ అణ్వాయుధాల ఉనికి గురించి చాలా కాలంగా అస్పష్టమైన విధానాన్ని పాటిస్తోంది. వాటి ఉనికిని ధృవీకరించడం గానీ, ఖండించడం గానీ చేయడం లేదు.
నెగెవ్లో ఉన్న ఈ కేంద్రం, వాయు రక్షణ వ్యవస్థచే రక్షించబడుతోంది. దేశంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటి. ఈ నెల మొదట్లో, ఇస్లామిక్ రిపబ్లిక్లో ఇజ్రాయెల్ – అమెరికా పాలన మార్పుకు ప్రయత్నిస్తే, డిమోనా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిశోధనా కేంద్రాన్ని 1950వ దశకంలో ఫ్రెంచ్ సహాయంతో నిర్మించారు. ఇజ్రాయెల్ మొదట్లో చాలా సంవత్సరాల పాటు ఈ కేంద్రం సైనిక ప్రయోజనాన్ని దాచిపెట్టింది. ఒకానొక సమయంలో అమెరికా అధికారులకు ఇది ఒక వస్త్ర కర్మాగారం అని చెప్పింది.
వీడియో ఇక్కడ చూడండి..
20 WOUNDED AS IRANIAN BALLISTIC MISSILE TEARS THROUGH ISRAEL’S DIMONA pic.twitter.com/Kw9ktUEsh1
— RT (@RT_com) March 21, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
