ఇరాన్ ! నిన్ను వదలం ! ట్రంప్ వార్నింగ్ !

|

Jan 01, 2020 | 5:49 PM

బాగ్దాద్ లోని తమ దేశ ఎంబసీపై ఇరాన్ అనుకూల నిరసనకారులు చేసిన దాడిపై భగ్గుమంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇందుకు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఇక ఇరాన్ భూభాగంలోకి తాము వందలాది ట్రూపులను పంపుతామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 29 న ఇరాన్ కు చెందిన కతాబ్ -ఎ -హిజ్బుల్లా అనే గ్రూపు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో రెండు డజన్ల మంది మరణించారు. దీంతో ప్రతీకారంగా ప్రో-ఇరాన్ మిలీషియా […]

ఇరాన్ ! నిన్ను వదలం ! ట్రంప్ వార్నింగ్ !
Follow us on

బాగ్దాద్ లోని తమ దేశ ఎంబసీపై ఇరాన్ అనుకూల నిరసనకారులు చేసిన దాడిపై భగ్గుమంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇందుకు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఇక ఇరాన్ భూభాగంలోకి తాము వందలాది ట్రూపులను పంపుతామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 29 న ఇరాన్ కు చెందిన కతాబ్ -ఎ -హిజ్బుల్లా అనే గ్రూపు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో రెండు డజన్ల మంది మరణించారు. దీంతో ప్రతీకారంగా ప్రో-ఇరాన్ మిలీషియా సభ్యులు బాగ్దాద్ లోని హై సెక్యూరిటీ గ్రీన్ జోన్ చెక్ పాయింట్లను ఛేదించుకుని అమెరికన్ ఎంబసీపై దాడికి పాల్పడ్డారు.

ఇరాక్ నుంచి అమెరికన్ దళాలను ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. ఇరాన్ లో రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధినేత ఖాసిం సోలిమనికి విధేయులమని చెప్పుకుంటున్న ఆందోళనకారులు అమెరికాకు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఎంబసీ కాంపౌండ్ కి నిప్పుపెట్టారు. ఇలా ఉండగా.. అబూ-మహాది-అల్ ముహందీస్ అనే కరడు గట్టిన ఉగ్రవాది ఒక వ్యూహం ప్రకారం టెర్రరిస్టులను ఈ దాడికి ప్రేరేపిస్తున్నాడని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. కాగా -తాము రానున్న రోజుల్లో ఇరాన్ కు 750 సైనిక ట్రూపులను తరలించనున్నట్టు రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ప్రకటించారు.
ఇలా ఉండగా.. బాగ్దాద్ లో రెండో రోజు కూడా ఇరాన్ అనుకూల ఆందోళనకారులు అమెరికన్ ఎంబసీలోకి చొచ్ఛుకుపోవడానికి ప్రయత్నించారు. ఈ కార్యాలయంలోని ఏ ఒక్క ఉద్యోగినీ వదలబోమని వీరిలో ఒకడు కేక పెట్టాడు. అటు-అమెరికా.. తమ హెలికాఫ్టర్లలో మరింతమంది సైనికులను ఈ స్పాట్ వద్దకు పంపుతోంది.