Lucky Draw: దుబాయ్లో జాక్పాట్ కొట్టేసిన భారతీయుడు.. ఒక్క రోజులో కోటీశ్వరుడు.. రూ.7.45 కోట్ల లాటరీ..!
Lucky Draw: ఏదైనా సమయం కోసం వేచి చూడాలంటారు. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే అదృష్టం తలుపు తడుతుంటుంది. తాజాగా దుబాయ్లో భారతీయుడు..

Lucky Draw: ఏదైనా సమయం కోసం వేచి చూడాలంటారు. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే అదృష్టం తలుపు తడుతుంటుంది. తాజాగా దుబాయ్లో భారతీయుడు ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యాడు. భారత్కు చెందిన ప్రైవేటు నౌక ఉద్యోగి పని చేస్తున్న గణేష్ షిండే దుబాయ్లో ఈ అదృష్టం వరించింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానేకు చెందిన 36 ఏళ్ల గణేశ్.. బ్రెజిల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో భాగంగా అతడు దుబాయ్, రియో డీ జనెయిరోల మధ్య రాకపోకలు సాగించేవాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా గణేష్ దుబాయ్ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. అయితే తాజాగా గణేష్ జాక్పాట్ కొట్టేశాడు. 1999లో ప్రారంభమైన మిలీనియం మిలియనీర్ లక్కీ లాటరీలో ఇప్పటివరకూ 180 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు. తాజాగా గణేశ్ లాటరీ సొంతం చేసుకోవడంతో ఆ సంఖ్య 181కి చేరింది.
ఇంకా షాక్లోనే ఉన్నాను: గణేష్
ఈ లాటరీ తగలడంతో గణేష్ పట్టరాని ఆనందంలో మునిగి తేలిపోయాడు. కొత్త కారు, కొత్త ప్లాటు కొంటాను. పిల్లల చదువు కోసం కొంత డబ్బులు దాచుకుంటాను. ఇంకా చాలా కోరికలున్నాయి.. అని చెప్పుకొచ్చాడు గణేష్. ఈ లాటరీ తగిలిందన్న విషయం తెలిసినా నమ్మాలనిపించడం లేదు. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. ఇది చాలా గొప్ప అవకాశం. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను దుబాయ్ నగరాన్ని ప్రేమిస్తున్నాను. త్వరలోనే దుబాయ్ను సందర్శించాలని అనుకుంటున్నాను.
