AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

42 రోజుల్లో 12వ హత్య.. మరో హిందువుపై దారుణం.. ఆటో డ్రైవర్‌ను కొట్టి చంపి దుండగులు!

బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసలో మరో హిందూ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్‌ అనే ఆటో డ్రైవర్‌ను ఆదివారం (జనవరి 11) రాత్రి ఒక గ్యాంగ్ అత్యంత దారుణంగా కొట్టి చంపారు. దీంతో, భారత వ్యతిరేక విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తరువాత హింసాత్మక నిరసనలు జరుగుతున్న దేశంలో ఇప్పటివరకు 12 మంది హిందువులు హత్యకు గురయ్యారు.

42 రోజుల్లో 12వ హత్య.. మరో హిందువుపై దారుణం.. ఆటో డ్రైవర్‌ను కొట్టి చంపి దుండగులు!
Samir Kumar Das, Worked As An Auto Driver
Balaraju Goud
|

Updated on: Jan 13, 2026 | 10:22 AM

Share

బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసలో మరో హిందూ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్‌ అనే ఆటో డ్రైవర్‌ను ఆదివారం (జనవరి 11) రాత్రి ఒక గ్యాంగ్ అత్యంత దారుణంగా కొట్టి చంపారు. దీంతో, భారత వ్యతిరేక విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తరువాత హింసాత్మక నిరసనలు జరుగుతున్న దేశంలో ఇప్పటివరకు 12 మంది హిందువులు హత్యకు గురయ్యారు .

దక్షిణ బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ డివిజన్‌లోని ఫెని జిల్లాలోని దగన్‌భూయాన్‌లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు 28 ఏళ్ల హిందూ వ్యక్తిని కొట్టి, కత్తితో పొడిచి చంపారు. అంతేకాదు అతని ఆటోరిక్షాను కూడా దొంగిలించారు. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సమీర్ ఆటోరిక్షాలో ఇంటి నుండి బయలుదేరాడు. రాత్రి ఆలస్యంగా తిరిగి రాకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో, స్థానికులు జగత్‌పూర్ గ్రామంలోని ఒక పొలంలో అతని మృతదేహాన్ని గుర్తించారు.

సమీర్ హత్యకు ఇంట్లో తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించారని దగన్‌భూయాన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. బంగ్లాదేశ్‌లో 23 రోజుల్లో ఇది ఏడవ హిందువు హత్య. గతంలో, జనవరి 5న, బంగ్లాదేశ్‌లోని నర్సింగ్డి జిల్లాలో ఒక హిందూ దుకాణదారుడిని పదునైన ఆయుధాలతో హత్య చేశారు. మృతుడిని 40 ఏళ్ల శరత్ చక్రవర్తి మణిగా గుర్తించారు.

ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ గాయకుడు, సాంస్కృతిక కార్యకర్త ప్రోలోయ్ చాకి వైద్య చికిత్స అందకపోవడంతో మరణించారు. జనవరి 11వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అతన్ని రాజ్‌షాహి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రోలోయ్ ప్రముఖ సాంస్కృతిక నిర్వాహకుడు, నటుడు దివంగత లక్ష్మీ దాస్ చాకి కుమారుడు. ప్రోలోయ్ నిషేధించిన అవామీ లీగ్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

ముస్లింలు అధికంగా నివసించే బంగ్లాదేశ్‌లో, దాదాపు 170 మిలియన్ల జనాభాతో, 2024 తిరుగుబాటు తర్వాత పరిస్థితి అస్థిరంగానే మారింది. ఇస్లామిక్ గ్రూపుల పెరిగిన కార్యకలాపాలు మైనారిటీలపై దాడులకు తెగబడుతున్నాయి. హిందువులు, సూఫీ ముస్లింలతో సహా మైనారిటీలు బంగ్లాదేశ్ జనాభాలో 10% ఉన్నారు. దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గాలపై పెరుగుతున్న దాడులపై బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రైస్తవ ఐక్యతా మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మత హింస సంఘటనలు పెరిగాయని ఆరోపించింది.

మరోవైపు, మైనారిటీలపై పదే పదే జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని భారతదేశం తెలిపింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పట్ల, ముఖ్యంగా హిందువుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. గత వారం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్‌లోని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. “బంగ్లాదేశ్‌లో మైనారిటీలు మరియు వారి ఆస్తులపై పదేపదే దాడులు జరుగుతున్న ఆందోళనకరమైన నమూనాను మనం చూస్తున్నాము. ఇటువంటి సంఘటనలను దృఢంగా, వెంటనే పరిష్కరించాలి” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!