AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కస్టమర్‌లాగా వచ్చి కాల్చి చంపాడు.. అమెరికాలో గుజరాతీ వ్యక్తి దారుణ హత్య..!

అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తిని అతి దారుణంగా కాల్చి చంపారు. ఉపాధి నిమిత్తం గుజరాత్ రాష్ట్రం నుంచి అమెరికా వెళ్లిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి కిరాతకంగా హత్య చేశాడు ఓ దుండగుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కస్టమర్‌లాగా వచ్చి కాల్చి చంపాడు.. అమెరికాలో గుజరాతీ వ్యక్తి దారుణ హత్య..!
Gujarati Man Shot Dead In Us
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 22, 2025 | 8:25 AM

Share

అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తిని అతి దారుణంగా కాల్చి చంపారు. ఉపాధి నిమిత్తం గుజరాత్ రాష్ట్రం నుంచి అమెరికా వెళ్లిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి కిరాతకంగా హత్య చేశాడు ఓ దుండగుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా మన దేశం నుంచి ఎంతో మంది ఉపాధి పనుల నిమిత్తం పొరుగు దేశాలకు వెళ్లడం చూస్తూ ఉంటాం. ఆ క్రమంలోనే అమెరికా వెళ్లి అక్కడ సంపాదించుకుని భవిష్యత్తు కోసం పాటుపడేవాళ్లు కూడా ఎంతో మంది. ఇదే రీతిలో గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ – కలోల్ పరిధిలోని గుండిచా గ్రామానికి చెందిన పరేష్ పటేల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అమెరికా వెళ్లి పని నిమిత్తం అక్కడే ఉంటూ ఒక దుకాణంలో పని చేస్తున్నాడు. అయితే.. ఎప్పటిలాగే బుధవారం (మే 21) దుకాణంలో పని చేసుకుంటున్న అతని వద్దకు కస్టమర్‌లా వ్యవహరిస్తూ ఓ వ్యక్తి వచ్చాడు. మొదట ఏదో కావాలి అన్నట్లుగా మామూలుగానే అడగ్గా.. పరేష్ ఆ వస్తువును ఇచ్చి అందుకు చెల్లించాల్సిన నగదును తీసుకున్నాడు.

ఆ మరుక్షణమే దుండగుడు నగదు కౌంటర్ వద్ద పరేష్ పటేల్ నుంచి డబ్బును లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. డబ్బు ఇచ్చేయమని అన్నట్లు తుపాకీ చూపించి బెదిరించాడు. ఊహించని ఈ హఠాత్తు పరిణామానికి పటేల్ భయపడిపోయి ఏం చేయాలో తెలియక అతను చెప్పినట్లే చేశాడు. సాయం కోసం అర్థించాలని అనుకున్నా సమయానికి అక్కడ ఎవరూ లేని పరిస్థితి. దిక్కుతోచనిస్థితిలో బిక్కుబిక్కుమంటూ పటేల్ తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని దుండగుడికి అప్పగించాడు. అతను అంతటితో విడిచిపెట్టి వెళ్లకుండా మొత్తం డబ్బును దోచుకున్న వెంటనే పటేల్‌ను కాల్చి చంపాడు.

డబ్బు తీసుకున్న వెంటనే ఆ దుండగుడు కాల్చడంతో అక్కడికక్కడే పరేష్ కుప్పకూలిపోయాడు. ఆపై మరోసారి అతనిని గమనించి చనిపోయాడా లేదా అని నిర్ధారించుకోవడానికి ఆ దుండగుడు మళ్లీ మరోసారి కాలుస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఎక్కడో పొరుగు దేశం వెళ్లి కష్టం చేసుకుని బతుకుదామనుకున్న పరేష్ లాంటి వ్యక్తి ఇలా కాల్పుల్లో చనిపోవడం అతని స్వగ్రామం గుండిచాలో తీవ్ర విషాదం నింపింది. మృతుడికి అప్పటికే పెళ్లి కూడా అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ద్వారా దుండగుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం