AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etikoppaka Toys: బొమ్మల తయారీతో 200 మందికి ఉపాధి మార్గం చూపిన రాజు.. ప్రధాని మోడీ ప్రశంసలు ఎలా పొందారో తెలుసుకోండి!

శాఖపట్నానికి చెందిన సివి రాజు 500 ఏళ్ల నాటి ఏటికొప్పాక బొమ్మల కళ ద్వారా ఎంతో సంపాదన పొందడమే కాకుండా 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ వారి జీవితాలను సుసంపన్నం చేస్తున్నాడు.

Etikoppaka Toys: బొమ్మల తయారీతో 200 మందికి ఉపాధి మార్గం చూపిన రాజు.. ప్రధాని మోడీ ప్రశంసలు ఎలా పొందారో తెలుసుకోండి!
Etikoppaka Toys
KVD Varma
|

Updated on: Nov 23, 2021 | 10:09 PM

Share

Etikoppaka Toys: విశాఖపట్నానికి చెందిన సివి రాజు 500 ఏళ్ల నాటి ఏటికొప్పాక బొమ్మల కళ ద్వారా ఎంతో సంపాదన పొందడమే కాకుండా 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ వారి జీవితాలను సుసంపన్నం చేస్తున్నాడు. ఈ పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు కూడా అందుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని తన మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. ఇది మాత్రమే కాదు, రాజును మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం కూడా సత్కరించారు.

రాజు ‘పద్మావతి అసోసియేట్స్‌’ పేరుతో హస్తకళాకారుల కోసం సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా కెమికల్ రహిత, పర్యావరణ అనుకూలమైన బొమ్మలను తయారు చేసి దేశవ్యాప్తంగా మార్కెట్ చేస్తున్నారు. 58 ఏళ్ల సివి రాజు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలోని ‘ఏటికొప్పాక గ్రామానికి’ చెందినవారు. ఈ గ్రామం వరాహ నది ఒడ్డున ఉంది, ఈ నదికి చాళుక్య రాజవంశానికి చెందిన రాజు పేరు పెట్టారు. సీవీ రాజు రైతు కుటుంబానికి చెందినవారు.

ఆయన తన గ్రామం గురించి.. బొమ్మల కళ గురించి ఇలా చెప్పారు. “నా గ్రామం, ఏటికొప్పాక, 500 సంవత్సరాలకు పైగా ‘ప్రత్యేకమైన సాంప్రదాయ చెక్క బొమ్మల’ తయారీకి ప్రసిద్ధి చెందింది, కానీ వివిధ కారణాల వల్ల, బొమ్మల తయారీ పని క్రమంగా తగ్గుతూ వచ్చింది. నేను ఈ బొమ్మలతో ఆడుకుంటూ పెరిగాను, అవి ఇలా ముగియడం నేను చూడలేకపోయాను. చేతివృత్తుల వారికి సహాయం చేయడానికి నేను పద్మావతి అసోసియేట్స్‌ని ప్రారంభించాను.”

పర్యావరణహితమైనవి..

రాజు ఇందుకోసం క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహాయాన్ని కూడా తీసుకున్నారు. ఇక ఈ ఏటికొప్పాక బొమ్మలు పూర్తిగా పర్యావరణ . సి.వి.రాజు బొమ్మలను రసాయన రహితంగా, పర్యావరణహితంగా మార్చేందుకు ఎన్నో ప్రయోగాలు చేశారు. అడవికి వెళ్లి వివిధ మొక్కలను పట్టుకుని, దీని మూలాలు, బెరడు, ఆకులు, పండ్లు, విత్తనాలు, పువ్వులు సేకరిస్తారు. పువ్వుల రంగుల నుంచి సహజ రంగును తీసుకుంటారు. “సాంప్రదాయ చెక్క బొమ్మలను తయారు చేయడానికి సహజ రంగులను ఉపయోగించారు. ఈ కారణంగా ఈ బొమ్మలు పిల్లలకు హాని కలిగించవు, కానీ క్రమంగా సహజ రంగుల వాడకం అంతరించి, సింథటిక్ రంగుల వాడకం మార్కెట్లో పెరిగింది.” అంటూ రాజు చెబుతున్నారు.

ఇక తన సహజ రంగుల విధానం ఎలా వచ్చిందో చెబుతూ.. మూడు నెలలపాటు రకరకాల ప్రయోగాలు చేసి చెట్లు, మొక్కల నుంచి ఎన్నో సహజసిద్ధమైన రంగులను సేకరించాను. దీని తర్వాత, ‘క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సహాయంతో అన్ని రంగులను పరీక్ష జరిపించాను. ఇందులో అన్ని రంగులు సేంద్రీయంగా వచ్చాయి. దాని నుండి మేము బొమ్మలు తయారు చేస్తున్నామన్నారు. సివి రాజు పర్యావరణ అనుకూలమైన బొమ్మల తయారీకి భిన్నమైన సాంకేతికతపై పనిచేశారు. ఏటికొప్పాక బొమ్మల్లో సహజ రంగుతో పాటు ‘లక్క’ రంగు కూడా వేయడంతో బొమ్మలు మెరుస్తూనే ఉన్నాయి. రాజు ఇలా వివరించారు.. “మేము మొదట పువ్వులు, ఆకులు మరియు విత్తనాలను పొడిగా చేస్తాము. తదనంతరం, సహజ రంగు వివిధ మార్గాల్లో తాయారు చేస్తాము. ఉదాహరణకు, కొన్ని గ్రైండింగ్ ద్వారా, కొన్ని నీటిలో మరిగించడం ద్వారా, కొన్ని ‘కోల్డ్ ప్రాసెసింగ్’ సాంకేతికత ద్వారా తయారు అవుతాయి. ఆ తర్వాత, ఈ రంగులను ‘లక్క’తో కలుపుతారు. బొమ్మలు లక్కతో పెయింట్ చేసిన తర్వాత, బొమ్మలకు మెరుపును జోడించడానికి ‘కేవ్రా’ (పి. టెక్టోరియస్) ఆకులతో పూర్తి చేయడం జరుగుతుంది. ఇలా రాజు టెక్నిక్‌తో హెర్బల్ డైతో తయారవుతున్న ‘ఏటికొప్పాక’ బొమ్మలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.

రాజుకు చెందిన పద్మావతి అసోసియేట్స్ అనేక రకాల ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తుంది. ఆటవస్తువులతో పాటు ఏటికొప్పాక గిన్నెలు, దేవాలయాల నుంచి నిత్యం గృహోపయోగం చేసుకునే వరకు పెట్టె వంటసామగ్రి కూడా ఉన్నాయి. పసుపు, కుంకుడు, తమలపాకులు, ఇతర సుగంధ ద్రవ్యాలు ఉంచడానికి మహిళలు పెట్టెని ఉపయోగిస్తారు. 200 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి

ఏటికొప్పాక బొమ్మలను మెరుగుపరిచేందుకు కళాకారులను స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆంధ్రా యూనివర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్ మరియు ఎం.ఎస్. బరోడా విశ్వవిద్యాలయం నుండి కొత్త డిజైన్లను బోధిస్తున్నారు. రాజు దీని గురించి వివరిస్తూ, “మా పనిని మెరుగుపరచుకోవడానికి మేము కొత్త మార్గాలను నేర్చుకుంటాము. దీని వల్ల మన పని పరిధి కూడా పెరుగుతుంది. ఈ రోజు ఈ బొమ్మలు నా చిన్న గ్రామంలో సుమారు 200 కుటుంబాలకు ఆసరాగా ఉన్నాయి. నిజానికి ఈ బొమ్మలు ఉపాధి మాత్రమే కాదు, అవి మనకు గర్వకారణం కూడా, ఎన్నో ఏళ్లుగా మన సంస్కృతిలో భాగం.” అని చెప్పారు.

రాజు తెలిపిన వివరాల ప్రకారం ఏటికొప్పాక బొమ్మలకు చెందిన ప్రతి హస్తకళాకారుడు రోజుకు 5 నుంచి 6 గంటలు పని చేస్తూ నెలకు 28 నుంచి 30 వేల బొమ్మలు తయారు చేస్తున్నారు. ఇ-కామర్స్ సహాయంతో దేశంలోని ప్రతి ప్రాంతంలో విక్రయిస్తునారు. ఇలా ఒక్కో చేతివృత్తిదారునికి నెలకు దాదాపు 25 నుంచి 30 వేల రూపాయల ఆదాయం వస్తోంది.

ప్రధానమంత్రి నుండి ప్రశంసలు మరియు రాష్ట్రపతి నుండి అవార్డు..

రాజు తన పనికి చాలా చోట్ల నుండి ప్రశంసలు అందుకున్నాడు. 2002లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆయన కృషికి జాతీయ అవార్డుతో సత్కరించారు. 2003లో ఆమెకు కమలాదేవి ఛటోపాధ్యాయ అవార్డు లభించింది. ఇది కాకుండా, INTACH 2014లో రాజును లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్ కూడా 2019లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. గత సంవత్సరం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ‘వోకల్ ఫర్ లోకల్’ని ప్రోత్సహించడానికి సివి రాజు చేసిన కృషిని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి: Vodafone Idea Tariff Hike: కస్టమర్లకు షాకివ్వనున్న వొడాఫోన్ ఐడియా.. భారం కానున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు.. ఎప్పటి నుంచో తెలుసా?

Joker Virus: యూజర్లు అలర్ట్.. జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. మీ ఫోన్‌లో ఈ 15 యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించండి

Follow Us