Kohinoor: ‘కోహినూర్’ విషయంలో బ్రిటన్‌ రాజవంశం కీలక నిర్ణయం.. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలే కారణమా..?

బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ రాజవంశం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని..

Kohinoor: ‘కోహినూర్’ విషయంలో బ్రిటన్‌ రాజవంశం కీలక నిర్ణయం.. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలే కారణమా..?
Kohinoor And Queet Of Britain Camilla Parker Bowles
Follow us

|

Updated on: Feb 15, 2023 | 4:39 PM

బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ రాజవంశం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని ధరించకూడదని నిర్ణయించింది. ఈ కిరీటానికి బదులు క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని చార్లెస్-3 భార్య కెమిల్లా ధరించనున్నారు. పట్టాభిషేకం సమయంలో రాణి కెమిల్లా కిరీటధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని ధరించాలని తొలుత భావించినప్పటికీ.. చివరకు ఆ ఆలోచనను పక్కనపెట్టారు రాజవంశీయులు. ఈ నిర్ణయంతో క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు. ఈ కిరీటంలో క్వీన్ ఎలిజబెత్-2కి చెందిన నగలను కూడా పొదగనున్నారు.

ఇక క్వీన్ ఎలిజబెత్-2 కిరీటంలో కోహినూర్ వజ్రం ఉండేదని మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఏడు దశాబ్దాల పాటు అంటే.. ఎలిజబెత్-2 మరణించే రోజు దాకా ఆమె కిరీటంలో ఈ కోహినూర్ వజ్రం ఉంది. కోహినూర్ వజ్రం మన దేశానికి చెందినది అనే విషయం మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ కోహినూర్ మన ఆంధ్రప్రదేశ్‌లోనే లభ్యమైంది. ఈ నేపథ్యంలోనే భారత్‌తో దౌత్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే కోహినూర్‌ను ధరించకూడదని రాణి కెమిల్లా, ఇంకా బ్రిటన్ రాజవంశీయులు నిర్ణయించినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..