
బలూచిస్థాన్లో గత కొంతకాలంగా వరసగా పేలుళ్ల ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మస్తుంగ్ జిల్లాలో అల్-ఫలాహ్ మసీదు సమీపంలో ఈద్ మిలాద్-ఉల్-నబీ ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిగింది. ఈ దాడిలో 25 మంది మృతి చెందారు. భారీ సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. దీంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే చేరుకోవాలని సూచించారు. ఈ పేలుడులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) మరణించారు.
ఈ నెల ప్రారంభంలో.. ఇదే జిల్లాలో జరిగిన పేలుడులో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUI-F) నాయకుడు హఫీజ్ హమ్దుల్లాతో సహా కనీసం 11 మంది గాయపడ్డారు. వారాల క్రితం బస్టాండ్లో ఒక లెవీ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపగా.. అదే సమయంలో ఆ దారిన వెళుతున్న మరో ఇద్దరు గాయపడ్డారు.
#Pakistan At least four people were died and more than 50 others were wounded in an explosion near a masjid in #Mastung area of #Balochistan during the main procession of Eid Milad-ul-Nabi. pic.twitter.com/eipuYn4HVW
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) September 29, 2023
గత ఏడాది అక్టోబర్లో మస్తుంగ్లోని కాబూ కొండ ప్రాంతంలో రెండు వాహనాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన బాంబు దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..