అరుదైన ఖనిజాల భద్రతే లక్ష్యం.. G7 క్రిటికల్ మినరల్స్ మంత్రివర్గ భేటీ.. హాజరైన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

ప్రపంచ కీలక ఖనిజాల సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, భద్రపరచడం లక్ష్యంగా G7 దేశాల క్రిటికల్ మినరల్స్ మంత్రివర్గ సమావేశమైంది. వ్యూహాత్మక రంగాలలో దుర్బలత్వాలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ సమావేశం జరిగింది. అమెరికా వాషింగ్టన్‌లో జరిగిన క్రిటికల్ మినరల్స్ మంత్రివర్గ సమావేశంలో కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.

అరుదైన ఖనిజాల భద్రతే లక్ష్యం.. G7 క్రిటికల్ మినరల్స్ మంత్రివర్గ భేటీ.. హాజరైన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnaw In G7 Critical Minerals Meeting

Updated on: Jan 13, 2026 | 9:16 AM

ప్రపంచ కీలక ఖనిజాల సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, భద్రపరచడం లక్ష్యంగా G7 దేశాల క్రిటికల్ మినరల్స్ మంత్రివర్గ సమావేశమైంది. వ్యూహాత్మక రంగాలలో దుర్బలత్వాలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ సమావేశం జరిగింది. అమెరికా వాషింగ్టన్‌లో జరిగిన క్రిటికల్ మినరల్స్ మంత్రివర్గ సమావేశంలో కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం (జనవరి 13) నాడు యునైటెడ్ స్టేట్స్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు.

కీలకమైన ఖనిజాలకు, ముఖ్యంగా అరుదైన భూమి మూలకాలకు సరఫరాను, ఖనిజాల భద్రపరచడానికి వైవిధ్యీకరణను పరిష్కరించడానికి US ట్రెజరీ కార్యదర్శి బెస్సెంట్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా X పోస్ట్‌లో, US ట్రెజరీ కార్యదర్శి పేర్కొన్నారు. “@USTreasury నిర్వహించిన నేటి ఆర్థిక మంత్రిత్వ శాఖ సమావేశంలో, కీలకమైన ఖనిజాల సరఫరాలో కీలక దుర్బలత్వాలను త్వరగా పరిష్కరించాలనే బలమైన, ఉమ్మడి కోరికను వినడానికి సంతోషిస్తున్నాను.” అని వెల్లడించారు.

కీలకమైన ఖనిజాలకు సంబంధించి ధైర్యంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న దేశాలకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు బెస్సెయింట్ చెప్పారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా, కెనడా, EU, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో, కీలకమైన ఖనిజాల సరఫరాలోని బలహీనతలను త్వరగా పరిష్కరించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ కీలకమైన వనరుల కోసం కఠినమైన, సురక్షితమైన, వైవిధ్యమైన సరఫరా మార్గాలను నిర్మించడానికి అమెరికా తన కొనసాగుతున్న పెట్టుబడులు మరియు భవిష్యత్తు ప్రణాళికలను వివరించింది. సరఫరా అంతరాలను సరిదిద్దడానికి తక్షణ చర్య అవసరమని గుర్తించి, అయా దేశాలు పూర్తిగా డీకప్లింగ్ చేయడానికి బదులుగా జాగ్రత్తగా డీరిస్కింగ్‌ను ఎంచుకుంటాయని అమెరికా కార్యదర్శి బెసెంట్ ఆశావాదం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. “భారతదేశంలో, తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ తయారీలో, భారత్ సహా అనేక దేశాలు కీలకమైన ఖనిజాల స్థితిస్థాపక సరఫరా చాలా ముఖ్యం. ఈ సమావేశంలో, వివిధ దేశాల నుండి పాల్గొనేవారు తమ అనుభవాన్ని, సరఫరా స్థితిస్థాపకంగా మార్చడంలో తీసుకుంటున్న చర్యలను, ముఖ్యంగా ఖనిజ ఖనిజాలను శుద్ధి చేయడం, ప్రాసెస్ చేయడం కోసం సాంకేతికతను చర్చించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తద్వారా అధిక-నాణ్యత కీలకమైన ఖనిజాలు, ముఖ్యంగా అరుదైన భూమి, శాశ్వత అయస్కాంతాలను దీర్ఘకాలికంగా స్థిరమైన పద్ధతిలో భద్రపరచవచ్చని” అన్నారు.

” ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం గురించి చర్చలు జరిగాయని, వివిధ దేశాల మధ్య సాంకేతిక భాగస్వామ్యం గురించి చర్చలు జరిగాయన్నారు. వ్యర్థ ఉత్పత్తుల నుండి ఖనిజాలను ఉపయోగించుకోవడానికి ఇది మంచి మార్గం. రీసైక్లింగ్ గురించి చాలా ముఖ్యమైన చర్చలు జరిగాయి. వివిధ దేశాల మధ్య పరిశోధన పనులను పంచుకోవడం గురించి చర్చలు, ఒప్పందాలు జరిగాయి. ఇది చాలా సానుకూల సమావేశం, ఇందులో కీలకమైన ఖనిజాల నాణ్యత, లభ్యతను మెరుగుపరచడం అనే ఆలోచన ప్రక్రియ జరిగింది.” అని కేంద్ర మంత్రి తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us