ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

అది ఆరేళ్ల క్రితం చోటు చేసుకున్న దారుణ ఘటన. అనుమానాస్పద స్థితిలో ఓ భారత సంతతి మహిళ మృతి చెందింది. క్రైమ్ సీన్‌లో పోలీసులకు ఎలాంటి..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!
Follow us

|

Updated on: Nov 21, 2020 | 8:56 AM

Indian-Fijian Monika Death: అది ఆరేళ్ల క్రితం చోటు చేసుకున్న దారుణ ఘటన. అనుమానాస్పద స్థితిలో ఓ భారత సంతతి మహిళ మృతి చెందింది. క్రైమ్ సీన్‌లో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆమెను ఎవరు చంపారు.? నిందితులు ఎవరు.? ఇలా అనేక ప్రశ్నలకు ఇప్పటికీ పోలీసుల దగ్గర సరైన సమాధానం లేదు. ఇంకా ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆ మిస్టరీ కేసును చేధించే క్రమంలో నిందితుల సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల డాలర్ల రివార్డును అందిస్తామని ప్రకటించారు. అసలు ఇంతకీ ఆ కేసు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం..

2014 జనవరిలో భారత సంతతి మహిళ మోనికా(39) హత్యకు గురయ్యారు. నిందితులు ఆమెను సిడ్నీకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో గల వెస్ట్‌ హోస్టన్ అడవుల్లో పడేశారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న మోనికాను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె సుమారు 28 రోజులు మృత్యువుతో పోరాడి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన న్యూసౌత్ వేల్స్ పోలీసులు.. నాటి నుంచి నేటి వరకు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా వారికి ఏ క్లూ దొరకలేదు. ఎవర్ని అరెస్ట్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే భారీ రివార్డును ప్రకటించారు. దీని వల్ల అయినా కేసును చేధించేందుకు ఆధారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. కాగా, నర్సుగా పని చేసే మోనికా ఓ వీసా కుంభకోణం ఇరుక్కున్నట్లు ఆమె స్నేహితులు వెల్లడించారు. అప్పుడప్పుడు తన ప్రాణాలకు ప్రమాదముందంటూ భయపడేదని వారు అంటున్నారు. ఇక ఆరేళ్లు గడుస్తున్నా నిందితులు దొరక్కపోవడంతో ఆమె కుమారుడు డానియల్, కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు