AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రెండు దేశాల సరిహద్దులో వరద విధ్వంసం.. కొట్టుకుపోయిన మైత్రి వంతెన.. 18 మంది గల్లంతు..

రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. నేపాల్ చైనా మధ్య ఉన్న మైత్రి వంతెన భోటేకోషి నది వరదలో కొట్టుకుపోయింది. ఈ వరదల కారణంగా 12 మంది నేపాలీలు, 6 మంది చైనా పౌరులు గల్లంతయ్యారు. ఖాట్మండు నుండి 120 కి.మీ దూరంలో ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో సరిహద్దులో ట్రాఫిక్ దెబ్బతింది. తప్పిపోయిన వారి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.

ఆ రెండు దేశాల సరిహద్దులో వరద విధ్వంసం.. కొట్టుకుపోయిన మైత్రి వంతెన.. 18 మంది గల్లంతు..
Nepal China Border Bridge
Jyothi Gadda
|

Updated on: Jul 08, 2025 | 5:48 PM

Share

రుతుపవనాల రాకతో భారతదేశం మాత్రమే కాకుండా నేపాల్‌లోని అనేక ప్రాంతాలు వర్షాల కారణంగా విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయి. నదులు భయంకర రూపంతో ప్రవహిస్తున్నాయి. ఉప్పొంగిన వరదలతో చాలా చోట్ల జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. నేపాల్ -చైనా సరిహద్దులో కూడా రుతుపవనాల ప్రభావం కనిపిస్తుంది. రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. నేపాల్ చైనా మధ్య ఉన్న మైత్రి వంతెన భోటేకోషి నది వరదలో కొట్టుకుపోయింది. ఈ వరదల కారణంగా 12 మంది నేపాలీలు, 6 మంది చైనా పౌరులు గల్లంతయ్యారు. ఖాట్మండు నుండి 120 కి.మీ దూరంలో ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో సరిహద్దులో ట్రాఫిక్ దెబ్బతింది. తప్పిపోయిన వారి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

నేపాల్-చైనా సరిహద్దులోని భోటేకోషి నదిలో నిన్న రాత్రి వరదల కారణంగా నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది. ఈ వరదలో నేపాల్-చైనా మధ్య ఉన్న ఏకైక వాణిజ్య కేంద్రమైన రసువాగధిని కలిపే మైత్రి వంతెన కొట్టుకుపోయింది. నేపాల్ -చైనాలను కలిపే ప్రధాన వంతెన మైత్రి వంతెన. భోటెకోషి నదిపై నిర్మించబడిన ఈ వంతెన నేపాల్‌లోని రసువా జిల్లాను చైనాకు అనుసంధానిస్తుంది. అయితే, భారీ వర్షాల కారణంగా, భోటెకోషి నది వరదల్లో మునిగిపోయింది. నిన్న రాత్రి 3:15 గంటల ప్రాంతంలో ఈ వంతెన వరదలో కొట్టుకుపోయింది. ఈ వంతెన ద్వారా చైనా- నేపాల్ మధ్య ప్రతిరోజూ లక్షల రూపాయల విలువైన వ్యాపారం జరిగేది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వరదలో వస్తువులతో నిండిన డజన్ల కొద్దీ కంటైనర్లు కూడా కొట్టుకుపోయాయి. ఇది మాత్రమే కాదు, చైనా నుండి నేపాల్‌కు ఎగుమతి చేయబడిన వందలాది ఎలక్ట్రిక్ వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. సరిహద్దు వద్ద ఆగివున్న డజన్ల కొద్దీ ట్రక్కులు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ వరద కారణంగా నేపాల్ వైపు దాదాపు 16 మంది గల్లంతయ్యారని తెలిసింది. నేపాల్ సైన్యం ఉదయం నుండి సహాయ చర్యలలో నిమగ్నమై ఉంది. హెలికాప్టర్ల ద్వారా కొంతమందిని రక్షించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా..
ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా..
థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి
వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి
కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం
కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం
భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?