అమెరికాలో తెలంగాణ విద్యార్ధిపై దాడి.. పరిస్థితి విషమం
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఖమ్మం విద్యార్థిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్ రాజ్, అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఎంఎస్ చదువుతున్నాడు.
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఖమ్మం విద్యార్థిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్ రాజ్, అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఎంఎస్ చదువుతున్నాడు. రోజూలాగే అక్టోబరు 31న వరుణ్ జిమ్కు వెళ్లాడు. జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా, ఓ దుండగుడు కత్తితో వరుణ్ను కత్తితో బలంగా పొడిచాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, చికిత్స నిమిత్తం వరుణ్ను ఆస్పత్రికి తరలించారు. వరుణ్ బతికే ఛాన్స్ 5 శాతం మాత్రమే ఉందని వైద్యులు తెలిపారు. వరుణ్పై దాడి చేసిన దుండగుడిని జోర్డాన్ ఆండ్రాడ్గా గుర్తించారు. అయితే దాడికి గల కారణాల గురించి అధికారులు విచారిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటి సీలింగ్ నుంచి పాములను బయటకు తీసిన మహిళ..
మద్యం తరలిస్తున్న కారుకు యాక్సిడెంట్.. బాటిళ్లకోసం ఎగబడిన జనం
LPG Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే ??
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!
పాట్నా స్టేషన్లో వింత దృశ్యం..ప్లాట్ఫామ్ నిండా పాదముద్రలే
గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. అప్పుడే ఓ అద్భుతం
ఆరు బ్యాంక్లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..
సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ

