గాజాను వదిలి ఇంకెక్కడికి వెళ్లాలంటూ బాధితుల గగ్గోలు

దక్షిణ గాజాలోని కొన్ని ప్రదేశాలపై ఇజ్రాయెల్‌ తాజాగా బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగియగానే దాడులు మొదలుపెట్టింది. అయితే జనమంతా ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వలస రావడంతో దాడులతో ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తమవుతోంది. ఊహించినట్లే గాజాపై దాడులు మొదలైనప్పటి నుంచి 200 మంది పాలస్తీనీయులు మరణించారు. దీంతో ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌ దాడుల్లో 15,200 మంది మరణించినట్లయింది.

గాజాను వదిలి ఇంకెక్కడికి వెళ్లాలంటూ బాధితుల గగ్గోలు

|

Updated on: Dec 04, 2023 | 1:13 PM

దక్షిణ గాజాలోని కొన్ని ప్రదేశాలపై ఇజ్రాయెల్‌ తాజాగా బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగియగానే దాడులు మొదలుపెట్టింది. అయితే జనమంతా ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వలస రావడంతో దాడులతో ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తమవుతోంది. ఊహించినట్లే గాజాపై దాడులు మొదలైనప్పటి నుంచి 200 మంది పాలస్తీనీయులు మరణించారు. దీంతో ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌ దాడుల్లో 15,200 మంది మరణించినట్లయింది. ఒప్పందం ముగియగానే ఇజ్రాయెల్‌పైకి హమాస్‌ రాకెట్లను ప్రయోగించింది. ఇటు ఇజ్రాయెల్‌ దళాలకు, లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా మిలిటెంట్లకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఇజ్రాయెల్‌ శనివారం ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో దాడులపై దృష్టిని కేంద్రీకరించింది. అంతకు ముందు రోజు ఆ ప్రాంతాన్ని వీడాలని పౌరులను హెచ్చరించింది. అయితే అక్కడి నుంచి తరలి వెళ్లేందుకు జనం ఇష్టపడటం లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాయం కోసం హిమాలయాలు ఘోషిస్తున్నాయి

అయోధ్య రాముడి ఆలయ ప్రారంభోత్సవానికి 6వేల మందికి ఆహ్వానం

గన్నుతో బెదిరించి కూతురి మెడలో తాళికట్టించిన మామ !!

ప్రియుడు చెప్పాడని.. లేడీస్ బాత్రూంలో రహస్య కెమెరా !!

Daily Horoscope: ఆ రాశివారు ఈరోజు శుభవార్తను వింటారు

 

Follow us