AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ల్యాండ్ అవుతూ.. కుప్పకూలిన విమానం

ల్యాండ్ అవుతూ.. కుప్పకూలిన విమానం

Phani CH
|

Updated on: Oct 21, 2025 | 8:27 PM

Share

ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో నేపథ్యంలో ఇప్పుడు హాంగ్ కాంగ్‌లో జరిగిన మరో విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి వస్తున్న కార్గో విమానం హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై అదుపుతప్పిన ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించారు.

సోమవారం తెల్లవారుజామున దుబాయ్‌ నుంచి హాంకాంగ్‌ చేరుకొన్న ఎమిరేట్స్‌ విమానం నార్త్‌ రన్‌వేపై దిగింది. ఈ నేపథ్యంలో విమానం అదుపుతప్పి.. ఆగకుండా ముందుకు దూసుకెళ్లి ఓ గ్రౌండ్ -సర్వీస్ వాహనాన్ని ఢీట్టింది. అనంతరం సముద్రంలో పడింది. విమానం దూసుకెళ్తున్న సమయంలో రన్‌వేపై ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరిని సిబ్బంది రక్షించారు. దీంతో ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ విమానాన్ని టర్కీకి చెందిన ఏసీటీ ఎయిర్‌ లైన్స్‌ సంస్థ ఎమిరేట్స్‌ నుంచి లీజుకు తీసుకొని నడుపుతుంది. టర్కిష్ క్యారియర్ ఎయిర్ ACT నడుపుతున్న ఎమిరేట్స్ స్కైకార్గో విమానం EK9788, దుబాయ్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత నార్త్ రన్‌వే 07Rను తాకినప్పుడు సోమవారం తెల్లవారుజామున 3.53 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని హాంకాంగ్ స్టాండర్డ్ రిపోర్ట్ వెల్లడించింది. మరోవైపు విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. హాంకాంగ్ ప్రభుత్వం రక్షణ చర్యల కోసం హెలికాప్టర్లు, అగ్నిమాపక నౌకలను పంపినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత కనీసం 11 కార్గో విమానాల రాకపోకలను రద్దు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఏడు గ్రామాల్లో నిశ్శబ్ద దీపావళి.. కారణం..

చిరు ఇంట తారల దీపావళి వేడుక నాగ్, వెంకీ, నయన్‌ల సందడి

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. మంగళవారం తులం ఎంతంటే ??

సమంత దీపావళి సెలబ్రేషన్స్‌రాజ్‌ నిడిమోరు కుటుంబంతో

బంగాళాఖాతంలో అల్పపీడనం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు