మొబైల్‌ సేవల్లో అంతరాయం.. ఒక్కో కస్టమర్‌కు 5 డాలర్ల పరిహారం

టెలికాం సేవల్లో అంతరాయం కలిగినందుకు గాను కస్టమర్లకు పరిహారం చెల్లించడానికి సిద్ధమైంది ఓ సంస్థ. అమెరికాలో గతవారం టెలికాం సేవల్లో తలెత్తిన అంతరాయానికి పరిహారంగా AT &T అనే సంస్థ తమ కస్టమర్లకు ఒక్కొక్కరికి ఐదు డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయం ఏటీ అండ్‌ టీ కంపెనీ ఆదివారం ప్రకటించింది. వచ్చే రెండు బిల్లింగ్‌ సైకిళ్లలో ఈ మొత్తాన్ని కస్ట్‌మర్స్‌ ఖాతాల్లో జమచేస్తామని చెప్పింది.

మొబైల్‌ సేవల్లో అంతరాయం.. ఒక్కో కస్టమర్‌కు 5 డాలర్ల పరిహారం

|

Updated on: Feb 27, 2024 | 8:26 PM

టెలికాం సేవల్లో అంతరాయం కలిగినందుకు గాను కస్టమర్లకు పరిహారం చెల్లించడానికి సిద్ధమైంది ఓ సంస్థ. అమెరికాలో గతవారం టెలికాం సేవల్లో తలెత్తిన అంతరాయానికి పరిహారంగా AT &T అనే సంస్థ తమ కస్టమర్లకు ఒక్కొక్కరికి ఐదు డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయం ఏటీ అండ్‌ టీ కంపెనీ ఆదివారం ప్రకటించింది. వచ్చే రెండు బిల్లింగ్‌ సైకిళ్లలో ఈ మొత్తాన్ని కస్ట్‌మర్స్‌ ఖాతాల్లో జమచేస్తామని చెప్పింది. ప్రీపెయిడ్‌ యూజర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే వారికి కూడా పరిహారం విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, అవి ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. AT &T , వెరిజోన్‌, టి-మొబైల్‌తో పాటు ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్‌ అనే నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ సైట్‌ గతవారం వెల్లడించింది. షికాగో, లాస్‌ ఏంజిల్స్‌‌, న్యూయార్క్‌ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌, బ్రూక్లిన్‌ సహా పలు ప్రాంతాల్లోని వినియోగదారులు సిగ్నల్‌ సమస్య ఎదుర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీశైల మల్లికార్జునుడికి బంగారుపళ్లెం కానుక..ఎవరు ఇచ్చారంటే ??

మరణం ఎవరికైనా బాధాకరమే !! కన్నీరు పెట్టిస్తున్న వీడియో

పైలట్‌ కళ్లలోకి లేజర్‌ లైట్‌.. గాల్లో 171 మంది ప్రాణాలు !!

Jayalalithaa AI: హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా

తాటిచెట్టుకు పెద్దపులి కాపలా !! కల్లుగీత కార్మికుడి ఐడియా అదిరిందిగా

Follow us