AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైల మల్లికార్జునుడికి బంగారుపళ్లెం కానుక..ఎవరు ఇచ్చారంటే ??

శ్రీశైల మల్లికార్జునుడికి బంగారుపళ్లెం కానుక..ఎవరు ఇచ్చారంటే ??

Phani CH
|

Updated on: Feb 27, 2024 | 8:25 PM

Share

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం, సోమవారం కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామి, అమ్మవార్ల దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శివనామస్మరణతో శ్రీశైలం మారమోగుతోంది. మరోవైపు మార్చి 1నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కోరిన కోర్కెలు తీర్చే మల్లికార్జునుడికి భక్తులు మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పిస్తుంటారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం, సోమవారం కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామి, అమ్మవార్ల దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శివనామస్మరణతో శ్రీశైలం మారమోగుతోంది. మరోవైపు మార్చి 1నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కోరిన కోర్కెలు తీర్చే మల్లికార్జునుడికి భక్తులు మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో శ్రీశైలం భ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్లకు చెన్నైకి చెందిన విమలాదేవి అనే ఓ భక్తురాలు బంగారు పళ్లెమును కానుకగా సమర్పించారు. 343 గ్రాములతో ఈ బంగారు పళ్ళెమును తయారు చేయించినట్లు దాతలు తెలిపారు. ఆలయ ఈవో డి.పెద్దిరాజుకు ఈ పళ్లెమును దాత కుటుంబ సభ్యులు అందజేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరణం ఎవరికైనా బాధాకరమే !! కన్నీరు పెట్టిస్తున్న వీడియో

పైలట్‌ కళ్లలోకి లేజర్‌ లైట్‌.. గాల్లో 171 మంది ప్రాణాలు !!

Jayalalithaa AI: హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా

తాటిచెట్టుకు పెద్దపులి కాపలా !! కల్లుగీత కార్మికుడి ఐడియా అదిరిందిగా