Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛత్రపతి శివాజీ వాడిన ఆయుధం.. త్వరలో భారత్‌కు

ఛత్రపతి శివాజీ వాడిన ఆయుధం.. త్వరలో భారత్‌కు

Phani CH

|

Updated on: Sep 11, 2023 | 7:46 PM

1659 లో బీజాపూర్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌ను అంతమొందించేందుకు మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్‌ నాఖ్’ త్వరలో భారత్‌కు తిరిగిరానుంది. పులి గోళ్ల లాగా కనిపించినే ఈ ఆయుధాన్ని ఇనుముతో తయారు చేశారు. దీన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించిందని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ తాజాగా పేర్కొన్నారు.

1659 లో బీజాపూర్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌ను అంతమొందించేందుకు మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్‌ నాఖ్’ త్వరలో భారత్‌కు తిరిగిరానుంది. పులి గోళ్ల లాగా కనిపించినే ఈ ఆయుధాన్ని ఇనుముతో తయారు చేశారు. దీన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించిందని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ తాజాగా పేర్కొన్నారు. ప్రస్తుతం విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ ఆయుధాన్ని వెనక్కు తెచ్చేందుకు మంత్రి ఈ నెలలో బ్రిటన్‌కు వెళ్లి మ్యూజియం వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఆ ఆయుధాన్ని తిరిగిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ అధికారుల నుంచి తమకు లేఖ అందిందని. ఈ ఏడాదిలోనే అది భారత్‌కు చేరవచ్చు అని మంత్రి పేర్కొన్నారు. అఫ్జల్ ఖాన్‌ను శివాజీ అంతమొందించిన రోజున దీన్ని భారత్‌కు తేవాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం ఇతర ముఖ్య తేదీలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంబా అని అరిచినా పట్టించుకోని మనిషి.. కంటతడి పెట్టిస్తున్న మూగజీవుల ఆక్రందన

ఆన్ లైన్ లో గేదె కొనుగోలు.. రూ.1.28 లక్షలు కుచ్చుటోపీ

అంతరిక్షంలో మరో సంచలనం.. అంగార‌కునిపై ఆక్సిజ‌న్‌..

బీర తోటలో కోతి ఫ్లెక్సీ పెట్టిన రైతు.. ఎందుకో తెలుసా ??

వీర్యం, అండం లేకుండానే పిండం.. వైద్య చరిత్రలో సంచలనం