అయోధ్యకు ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం !! దాని విలువ ఎంతంటే ??

అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుకకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే వివిధ కానుకలు ఆయోధ్యకు చేరాయి. ఈ క్రమంలోనే రామాలయానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రామాయణ పుస్తకాన్ని మనోజ్ సతీ అనే వ్యక్తి అందజేశాడు. దీని ధర రూ. 1.65 లక్షలు. ఈ పుస్తకంలో రామ మందిరాన్ని పోలి ఉండేలా రూపొందించిన మూడు పెట్టెలు, ఆలయానికి చెందిన మూడు అంతస్తులు చిత్రించబడి ఉన్నాయి. పుస్తకానికి ఉపయోగించిన కాగితం ఫ్రాన్సులో తయారైంది.

అయోధ్యకు ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం !! దాని విలువ ఎంతంటే ??

|

Updated on: Jan 22, 2024 | 6:13 PM

అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుకకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే వివిధ కానుకలు ఆయోధ్యకు చేరాయి. ఈ క్రమంలోనే రామాలయానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రామాయణ పుస్తకాన్ని మనోజ్ సతీ అనే వ్యక్తి అందజేశాడు. దీని ధర రూ. 1.65 లక్షలు. ఈ పుస్తకంలో రామ మందిరాన్ని పోలి ఉండేలా రూపొందించిన మూడు పెట్టెలు, ఆలయానికి చెందిన మూడు అంతస్తులు చిత్రించబడి ఉన్నాయి. పుస్తకానికి ఉపయోగించిన కాగితం ఫ్రాన్సులో తయారైంది. ఈ కాగితానికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే.. యాసిడ్ రహిత కాగితంగా ఇది పేటెంట్ పొందింది. పుస్తక ముఖచిత్రం ఈ పదార్థంతోనే రూపొందించారు. ఇందులో ఉపయోగించిన ఇంక్ జపాన్ నుంచి దిగుమతి అయింది. అంతేగాక దీని రూపకల్పనకు అమెరికన్ వాల్‌నట్ కలప, కుంకుమపువ్వు ఉపయోగించారు. 45 కిలోల బరువున్న ఈ పుస్తకం 400 ఏళ్లకు పైగా ఉంటుందని మనోజ్ సతీ తెలిపారు. ఈ పుస్తకాన్ని నాలుగు తరాలు చదవొచ్చని చెప్పారు. ప్రతి పేజీలో విభిన్నమైన డిజైన్‌ ఉండటం దీని ప్రత్యేకత అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోరంత సైజులో బంగారు అయోధ్య రామ మందిరం.. స్వర్ణకారుడి అద్భుత సృష్టి

తడబడి పడబోయిన సీఎం స్టాలిన్‌.. చేయందించిన పీఎం మోదీ

ముగిసిన సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల దాంపత్య జీవితం

షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా ?? సోషల్ మీడియాను కుదిపేస్తున్న పిక్

Follow us