రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
చంద్రపూర్ జిల్లాలో రైతులు, కూలీలను పొట్టనపెట్టుకున్న నరమాంస భక్షక పెద్దపులి (T-115) ని మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. రెండు నెలల పాటు 30 మందికి పైగా సిబ్బంది, ట్రాకింగ్ టీమ్లు, వందల ట్రాప్ కెమెరాలతో సాగిన భారీ ఆపరేషన్ విజయవంతమైంది. మత్తు ఇంజక్షన్ సాయంతో పెద్దపులి బోనులో చిక్కింది. ఇది స్థానికులకు పెద్ద ఊరట.
30 మందికి పైగా అటవిశాఖ అదికారులు, మూడు ట్రాకింగ్ టీమ్స్ , వందల సంఖ్యలో ట్రాప్ కెమెరాలు.. మ్యాన్ ఈటర్ కోసం రెండు నెలలుగా కొనసాగుతున్న ఆపరేషన్ ఎట్టకేలకు సక్సెస్ అయింది. రైతులు , రైతు కూలీలు, పదుల సంఖ్యలో పశువులను పొట్టనపెట్టుకున్న రక్తం మరిగిన బెబ్బులి.. అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపించింది. చివరకు అటవీశాఖ సిబ్బంది శ్రమ ఫలించి బోనులో చిక్కింది. మత్తు ఇంజక్షన్ సాయంతో పెద్దపులిని బంధించింది. ఈ ఘటన మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని పొంబూర్ణ తాలూకాలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా గోండ్ పిప్పిరీ తాలూకాలో ఇద్దరు వ్యవసాయ కూలీలను పొట్టనబెట్టుకున్న బెబ్బులిని మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు బంధించారు. గత అక్టోబరు 18న చెక్ పిపిరీ గ్రామానికి చెందిన బావూజి పాల్, అక్టోబర్ 26న గణేష్ పిపిరీ గ్రామానికి చెందిన అల్కా పెందోన్ అనే రైతులను బలి తీసుకున్న పులిని పట్టుకోవాలంటూ స్థానిక ప్రజానికం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ… పులి పాద ముద్రల ఆధారంగా టైగర్ ట్రాకింగ్ టీమ్స్ ఇచ్చిన సమాచారంతో పొంబూర్ణ తాలుకా అటవీ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ట్రాప్ కెమెరాలకు చిక్కిన పులిని మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎట్టకేలకు బోనులో చిక్కేలా చేసింది. పొంబూర్జ తాలూకా అటవీ ప్రాంతంలో అవినాష్ పూల్ జలే అనే షార్ప్ షూటర్ సహాయంతో పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చిన అటవిశాఖ సిబ్బంది.. ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. మత్తులోకి జారుకున్న పులిని బందించి, చంద్రపూర్ లోని టీటీసీ కు తరలించింది. పట్టుబడ్డ పులి మూడున్నరేళ్ల టీ 115 మగపులి గా గుర్తించారు. అనంతరం టైగర్… ట్రాంజక్ట్ సెంటర్ లో సురక్షితంగా ఉండేలా ఏర్పాటు చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
T20 వరల్డ్కప్కు టీమిండియా ఆటగాళ్లు వీరే
అర్ధరాత్రి కారు బీభత్సం.. ఆ తర్వాత
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్పోర్ట్కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

