పంటపొలాల్లో వింత జంతువు పరుగులు.. భయం భయంగా రైతులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత కొద్దిరోజుల నుండి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి భయంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు పొలాల్లో వింతజంతువు సంచరిస్తూ అక్కడి ప్రజలకు వెన్నులో వణుకు పుట్టించింది. దానిని చూసి హడలెత్తిపోయిన రైతులు, కూలీలు అక్కడినుంచి పరుగులు పెట్టారు.
ఓ మహిళ ధైర్యం చేసి ఆ వింత జంతువును తన సెల్ ఫోన్లో చిత్రీకరించి, ఊరంతా వైరల్ చేసింది. అది చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఆ వింత జంతువును గుర్తించారు. పెద్దపులి ఆకారంతో పొలాల మధ్య సంచరిస్తున్న ఈ జంతువును చూసి స్థానికులు మొదట పెద్దపులిగా భావించారు. సంధ్య అనే ఒక మహిళ తన సెల్ఫోన్లో చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేసింది. గ్రామ శివారులో పులి సంచరిస్తుందని వైరల్ చేయడంతో గ్రామస్తులంతా భయంతో వణికిపోయారు. పొలాలకు వెళ్లాలంటేనే భయపడ్డారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆ వింత జంతువు పాదముద్రలు సేకరించారు. వాటిని పరిశీలించిన అటవీ సిబ్బంది అవి పులి పాదముద్రలు కావని, అడవి పిల్లి పాదముద్రలుగా గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తీగ లాగితే.. ఢిల్లీ డొంక కదులుతోంది! హీరోయిన్ కాదు.. గోల్డ్ ఖిలేడీ!
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా కల్పన రికార్డు

