రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మనందరికి తెలుసు. కానీ, ఓ సీనియర్ ఉద్యోగి మాత్రం అది మరచి.. బాధ్యతారహితంగా ప్రవర్తించారు. ఐఆర్సీటీసీ ఉద్యోగి కదులుతున్న రైలులో నుంచి చెత్తను బయటకు విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆ అధికారిపై విమర్శలు వచ్చాయి.
రైల్లో చెత్త బుట్ట నిండిపోవడాన్ని ఆ సీనియర్ ఉద్యోగి గమనించారు. కదులుతున్న రైల్లో నుంచే చెత్తను పట్టాల పైకి విసిరేశారు. దీంతో అక్కడున్న ప్రయాణికులు అలా చేయకండి అంటూ వారించారు. అయినప్పటికీ ఉద్యోగి నవ్వుతూ.. మరి చెత్తను ఇంకెక్కడ వేయమంటారు? అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘సీనియర్ ఉద్యోగి అయినా.. మతి లేకుండా ప్రవర్తించారు’ అని ఒకరు.. ‘ఇది మన భారత రైల్వే వ్యవస్థ పరిస్థితి’ అంటూ మరొకరు అసహనం వ్యక్తం చేశారు. ‘ఇలా చేయడం తప్పుగా అనిపించడం లేదా..?’ అని ప్రశ్నించారు. ఈ ఘటనపై రైల్వే సేవ స్పందించింది. అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రైల్లోని చెత్తను తీసేందుకు యంత్రాంగం ఉంది. విధుల్లో ఉండి నిబంధనలను ఉల్లంఘించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నాం. జరిమానా కూడా విధించాం’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. సదరు ఉద్యోగిపై ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి.. చివరకు
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్!
హాట్ టాపిక్గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
Rashmika Mandanna: రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
Rashmi Gautam: పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి..
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్
మద్యం లేకుండా పెళ్లి జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్
ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !
అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ.. చెక్ చేయగా
కాలువలో పడ్డ కారు.. కాపాడమంటూ ఆర్తనాదాలు.. చివరికి..
గాజు సీసాలో తిరుమల శ్రీవారి ఆలయ గోపురం
నోట్లో పేలిన సెల్ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి

