అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త!
ప్రతి ఇంటి వంట గదిలో అల్యూమినియం పాత్రలు కనిపిస్తాయి. చాలామంది అల్యూమినియం పాత్రల్లోనే వంట చేస్తుంటారు. ఇది మంచిదికాదని, అల్యూమినియం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండొందల ఏళ్ల క్రితం డెన్మార్క్ లో కనిపెట్టిన అల్యూమినియంను ఆ దేశంలో కంటే భారత్లోనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీని దెబ్బకు మట్టి, ఇత్తడి, కంచు, రాగి పాత్రలు దాదాపు కనుమరుగైపోయాయి. అల్యూమినియంను డెన్మార్క్కు చెందిన ఓ శాస్త్రవేత్త 1825 లో కనుగొన్నారు. భారత్ లో అల్యూమినియం ఉత్పత్తిని ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ 1938 లో ప్రారంభించింది.
అప్పటినుంచి వీటి వాడకం విస్తృతమైంది. కానీ వీటిని వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? దీర్ఘకాలంగా అల్యూమినియం పాత్రల వాడకంతో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా ఈ లోహానికి శరీర నిర్మాణంలో ఎలాంటి పాత్రా లేదు. అందుకే అధిక భాగం మూత్ర విసర్జన రూపంలో బయటికి వెళ్లిపోతుంది. కడుపులోకి వెళ్లిన అల్యూమినియంలో 0.01% నుంచి 1% వరకూ జీర్ణకోశంలోకి చేరుతుంది. దీన్ని మూత్ర పిండాలు బయటకు వెళ్లగొడతాయి. అయితే దీనికి కణజాలాల్లో పేరుకునే స్వభావం ఉండటం వల్ల ఎముకలు, మెదడు వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదముంది. ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీజబ్బుతో బాధపడేవారికి మరింత ఎక్కువ హాని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా టమాటా, నిమ్మ, చింతపండు వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుంది. ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకు అవసరం. శరీరంలో పేరుకుపోయిన అల్యూమినియం ఇటువంటి ఉపయోగకరమైన లోహాలను మన శరీరానికి ఉపయోగపడకుండా నిరోధిస్తుంది. దాంతో రక్తహీనత, ఎముకలు మెత్తబడటం, డయాలిసిస్ ఎన్ కెఫలోపతి అనే నాడీ మండల వ్యాధికి కారణమవుతుందంటున్నారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
