ఐస్‌క్రీంలో మనిషి చేతి వేలు.. మిస్టరీని ఛేదించిన పోలీసులు

ముంబైలో ఇటీవల ఓ డాక్టర్‌ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీంలో మనిషి వేలు కనిపించడం సంచలనం రేపింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. ఐస్‌క్రీంలో వచ్చిన వేలు పూణెలోని ఫార్చూన్ కంపెనీ అసిస్టెంట్ ఆపరేటర్ మేనేజర్ ఓంకార్ పోటేదిగా గుర్తించారు. మే 11న ఐస్‌క్రీం ప్యాక్ చేస్తున్న సమయంలో ఓంకార్ తన మధ్యవేలిని ప్రమాదవశాత్తు కోల్పోయాడు. ఐస్‌క్రీం కోన్ తయారీ తేదీ దీనితో సరిపోలుతోంది.

ఐస్‌క్రీంలో మనిషి చేతి వేలు.. మిస్టరీని ఛేదించిన పోలీసులు

|

Updated on: Jul 03, 2024 | 12:53 PM

ముంబైలో ఇటీవల ఓ డాక్టర్‌ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీంలో మనిషి వేలు కనిపించడం సంచలనం రేపింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. ఐస్‌క్రీంలో వచ్చిన వేలు పూణెలోని ఫార్చూన్ కంపెనీ అసిస్టెంట్ ఆపరేటర్ మేనేజర్ ఓంకార్ పోటేదిగా గుర్తించారు. మే 11న ఐస్‌క్రీం ప్యాక్ చేస్తున్న సమయంలో ఓంకార్ తన మధ్యవేలిని ప్రమాదవశాత్తు కోల్పోయాడు. ఐస్‌క్రీం కోన్ తయారీ తేదీ దీనితో సరిపోలుతోంది. పూర్తిగా నిర్ధారణ చేసుకున్న అనంతరం పోలీసులు ఫార్చూన్ కంపెనీపై నిర్లక్ష్యంగా వ్యవహించారంటూ కేసు నమోదు చేశారు. జూన్ 12న ముంబైలోని మలాద్‌కు చెందిన 26 ఏళ్ల డాక్టర్ ఓర్లెమ్ బ్రెండన్ తన సోదరి ఆన్‌లైన్‌లో తెప్పించిన బటర్‌స్కాచ్ ఐస్‌క్రీంను తింటుండగా మనిషి వేలు దర్శనమించింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం ఐస్‌క్రీంలో వచ్చిన వేలు ఎవరిదన్న విషయాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Airtel: ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్‌ పెయిడ్ ధరల పెంపు

సొరకాయా.. మజాకా !! బోలెడన్ని ప్రయోజనాలు

Harom Hara: ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్.. OTTలోకి వస్తోన్న హరోం హర

జైలుకొచ్చిన అమ్మను చూసి.. చిన్న పిల్లాడిలా ఏడ్చిన స్టార్ హీరో

ఆటా.. పాటా.. హంగామా.. అంగరంగ వైభవంగా హీరోయిన్ మెహందీ ఈవెంట్

Follow us