స్టేషన్లో విరిగిన ట్యాప్.. తడిసిన రైలు ప్రయాణికులు..
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి. తాజాగా, రైల్వే స్టేషన్లో జరిగిన ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి. తాజాగా, రైల్వే స్టేషన్లో జరిగిన ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రైల్వే ప్లాట్ ఫామ్లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాప్ ఒకటి విరిగిపోయింది. దీంతో అందులోని నీరంతా వేగంగా విరజిమ్ముతూ ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులపై పడుతోంది. అందులో నుంచి వేగంగా వస్తున్న నీరు ప్రయాణికులనే కాదు ప్లాట్ఫామ్, రైళ్లను కూడా క్లీన్ చేస్తున్నట్లుగా ఉంది. నీరు వేగంగా ముందుకు జిమ్ముతున్న సమయంలో ఓ లోకల్ ట్రైన్ అక్కడికి రాగా.. ఆ నీరంతా రైలు కిటికీ, డోర్స్ నుంచి లోపలికి వెళ్లింది. దీంతో అందులోని ప్రయాణికులు సైతం తడిసి ముద్దయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ప్రయాణికులకు ఉచిత స్నానం.. ఆటో క్లీనింగ్ సిస్టమ్’’ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీనస్థితిలో సినీ కమెడియన్.. అనాథాశ్రయంలోనే !!
టీమిండియాపై పాకిస్థాన్ నటి సంచలన కామెంట్స్
చరణ్ తో సీక్రెట్ గా రంగస్థలం 2 మొదలెట్టిన సుక్కు
ప్రమాదంలో ఉన్న పిల్ల కోసం తల్లి సాహసం..!
రైల్లో రీల్స్ రచ్చ..ప్రయాణికుడి వీడియో వైరల్
వేసవిలో మట్టి కుండ నీరు కూల్ కూల్గా..!
13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు
ఫాదర్ మొమెంట్..కన్నబిడ్డను చూసి ఆనందంతో వణికిన తండ్రి చేతులు!
వాష్ రూమ్ డోర్ తీయగానే గుండె గుభేల్..
రోడ్డుపక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తిని చూసి చలించిపోయిన MLA

