స్టేషన్‌లో విరిగిన ట్యాప్‌.. తడిసిన రైలు ప్రయాణికులు..

సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి. తాజాగా, రైల్వే స్టేషన్‌లో జరిగిన ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

స్టేషన్‌లో విరిగిన ట్యాప్‌.. తడిసిన రైలు ప్రయాణికులు..

|

Updated on: Nov 04, 2022 | 8:42 AM

సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి. తాజాగా, రైల్వే స్టేషన్‌లో జరిగిన ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రైల్వే ప్లాట్‌ ఫామ్‌లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాప్‌ ఒకటి విరిగిపోయింది. దీంతో అందులోని నీరంతా వేగంగా విరజిమ్ముతూ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులపై పడుతోంది. అందులో నుంచి వేగంగా వస్తున్న నీరు ప్రయాణికులనే కాదు ప్లాట్‌ఫామ్‌, రైళ్లను కూడా క్లీన్‌ చేస్తున్నట్లుగా ఉంది. నీరు వేగంగా ముందుకు జిమ్ముతున్న సమయంలో ఓ లోకల్‌ ట్రైన్‌ అక్కడికి రాగా.. ఆ నీరంతా రైలు కిటికీ, డోర్స్‌ నుంచి లోపలికి వెళ్లింది. దీంతో అందులోని ప్రయాణికులు సైతం తడిసి ముద్దయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ప్రయాణికులకు ఉచిత స్నానం.. ఆటో క్లీనింగ్‌ సిస్టమ్‌’’ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీనస్థితిలో సినీ కమెడియన్.. అనాథాశ్రయంలోనే !!

టీమిండియాపై పాకిస్థాన్ నటి సంచలన కామెంట్స్

చరణ్ తో సీక్రెట్ గా రంగస్థలం 2 మొదలెట్టిన సుక్కు

తుపాల్సి షో కాదు.. ఇక దద్దరిల్లిపోవుడు షురూ అయింది !!

Rambha: యాక్సిడెంట్ గురించి చెబుతూ.. రంభ ఎమోషనల్..

Follow us
Latest Articles