AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీళ్లలో ఎంజాయ్ చేస్తున్న కుటుంబ సభ్యులు.. కళ్ల ముందే కొట్టుకుపోయారు..

నీళ్లలో ఎంజాయ్ చేస్తున్న కుటుంబ సభ్యులు.. కళ్ల ముందే కొట్టుకుపోయారు..

Phani CH
|

Updated on: Jul 04, 2024 | 12:53 PM

Share

ముంబైలోని లోనావాల సమీపంలో ఉన్న ఓ జలపాతం వద్ద ఆదివారం ఘోరం చోటుచేసుకుంది. నీటి ఉధృతి పెరగడంతో ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు కొట్టుకుపోయారు. సాయం కోసం వాళ్లు చేస్తున్న ఆర్తనాదాలు వింటూ మిగతా టూరిస్టులు నిస్సహాయంగా చూస్తు ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముంబైలోని లోనావాల సమీపంలో ఉన్న ఓ జలపాతం వద్ద ఆదివారం ఘోరం చోటుచేసుకుంది. నీటి ఉధృతి పెరగడంతో ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు కొట్టుకుపోయారు. సాయం కోసం వాళ్లు చేస్తున్న ఆర్తనాదాలు వింటూ మిగతా టూరిస్టులు నిస్సహాయంగా చూస్తు ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం జలపాతం వద్ద టూరిస్టులు సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. ముంబైకి చెందిన ఓ కుటుంబం జలపాతం వద్దకు విహారయాత్రకు వచ్చింది. ఏడుగురు కుటుంబ సభ్యులు నీళ్లలో ఎంజాయ్ చేస్తుండగా.. సడెన్ గా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో నీళ్లలో కొట్టుకుపోకుండా ఏడుగురూ ఒకరినొకరు పట్టుకుని నిలబడ్డారు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ.. ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నించారు. అయితే, నీటి ఉధృతి కారణంగా వారికి సాయం చేయలేకపోయామని మిగతా టూరిస్టులు చెప్పారు. చూస్తుండగానే వారంతా నీళ్లలో కొట్టుకుపోయారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..ఎంతంటే ??

అక్కడ అత్తారింటిలో.. అల్లుళ్లే కుడికాలు పెట్టాలి !! అదే ఆచారం

గిరజనుల వలలో వింత చేపలు.. ఆశ్చర్యపోయిన మత్స్యకారులు

తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్

బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే