AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంగోలు పేస్‌ కాలేజీ సమీపంలో రోడ్డుప్రమాదం

ఒంగోలు పేస్‌ కాలేజీ సమీపంలో రోడ్డుప్రమాదం

Phani CH
|

Updated on: Oct 13, 2025 | 2:58 PM

Share

ఒంగోలులోని పేస్ కాలేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉద్యోగుల మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడలో విద్యుత్ ధర్నాకు వెళ్తున్న ఉద్యోగుల బస్సుగా గుర్తించారు. మరోవైపు, మహబూబాబాద్ జిల్లా మరిపెడ వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా పడగా, ఐదుగురు గాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. ఒంగోలులోని పేస్ కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఉద్యోగుల మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు మరణించగా, 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. విజయవాడలో జరగనున్న విద్యుత్ ధర్నాకు పలమనేరు నుంచి వెళ్తున్న ఉద్యోగులు ఈ బస్సులో ఉన్నట్లు గుర్తించారు. మరో సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ సమీపంలో చోటు చేసుకుంది. గుంతను తప్పించబోయే క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉండగా, ఐదుగురు స్వల్ప గాయాల పాలయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు బీజేపీ ఆగ్రహం

రుషికొండపై ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం

ప్రధాని మోదీకి ఆలస్యంగా ఆహ్వానం.. హాజరుపై సందిగ్ధత

నేడు అమరావతిలో CRDA కార్యాలయం ఘనంగా ప్రారంభం