AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుషికొండపై ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం

రుషికొండపై ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం

Phani CH
|

Updated on: Oct 13, 2025 | 2:43 PM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుషికొండ భవనాల భవిష్యత్తుపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తోంది. గత ప్రభుత్వం ₹452 కోట్లతో నిర్మించిన ఈ కట్టడాలను ఎలా వినియోగించాలో నిర్ణయించేందుకు ప్రజల అభిప్రాయాలు ముఖ్యమని తెలిపింది. మీ సూచనలను rushikonda@aptdc.in కు మెయిల్ చేయవచ్చు.

విశాఖపట్నంలోని రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాల భవిష్యత్తు వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు, సూచనలను కోరుతోంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ నిర్మాణాలపై ₹452 కోట్లు ఖర్చు చేసింది. అత్యంత ఖరీదైన మౌలిక సదుపాయాలతో కూడిన ఈ నిర్మాణాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో పరిశ్రమలను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించిందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు, ప్యాలెస్‌లు నిర్మించడం కాదని అన్నారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రుషికొండ భవనాల వినియోగంపై నివేదిక ఇవ్వనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రధాని మోదీకి ఆలస్యంగా ఆహ్వానం.. హాజరుపై సందిగ్ధత

నేడు అమరావతిలో CRDA కార్యాలయం ఘనంగా ప్రారంభం