సెలవులకు తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. మీకో గుడ్న్యూస్
మరి కొన్ని రోజుల్లో విద్యార్ధులకు పూర్తి స్థాయిలో వేసవి సెలవులు వచ్చేస్తాయి. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఫలితాలకోసం ఎదురు చూస్తున్నారు. ఇలా రిజల్ట్ రాగానే అలా టూర్లకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ఇందులో ఎక్కువమంది ముందుగా వెళ్లేది తిరుమల శ్రీనివాసుని దర్శనానికే. ఇలాంటి వారికోసం దక్షిణ మధ్యరైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్, మే నెలల్లో వారానికి రెండు చొప్పున నడపనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుమల తిరుపతి వెళ్లే ప్రయాణికుల కోసం 32 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. మే 23వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ వారానికి రెండు సార్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి నుంచి 07017 నెంబరు గల రైలు శుక్ర ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇక తిరుపతి నుంచి 07018 నెంబరు గల రైలు శని, సోమవారాల్లో నడుస్తుంది. ఇది మల్కాజిగిరి, కాచిగూడ, మహబూబ్నగర్, జడ్చర్ల, డోన్, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. చర్లపల్లి నుంచి ఉదయం 9: 35 గంటలకు బయలుదేరుతుంది ఈ స్పెషల్ ట్రైన్. తిరుపతి నుంచి సాయంత్రం 4: 40 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొంగతనంలో వీరి నైపుణ్యం వేరప్పా.. చక్కగా వచ్చారు.. చటుక్కున్న కొట్టేసారు
మీ పిల్లలకు ఐస్క్రీమ్ కొనిస్తున్నారా? ఈ భయంకర వ్యాధులు తప్పవు!
వైట్ రైస్కి బదులుగా ఓట్స్ తింటున్నారా ?? జరిగేది ఇదే..
రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఇకపై అలా కుదరదు..
మంచం తో కారు తయారుచేసి.. రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. కట్ చేస్తే షాకిచ్చిన పోలీసులు

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
