YS Jagan: పిడుగురాళ్లలో ‘సిద్దం’ బహిరంగ సభ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. 12వ రోజు గంటావారిపాలెం నుంచి మొదలైన బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దారిపొడవునా వైసీపీ శ్రేణులు, ప్రజలు జగన్కు స్వాగతం పలుకుతున్నారు. గంటావారిపాలెం దగ్గర సీఎం జగన్ను పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కలిశారు.
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. 12వ రోజు గంటావారిపాలెం నుంచి మొదలైన బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దారిపొడవునా వైసీపీ శ్రేణులు, ప్రజలు జగన్కు స్వాగతం పలుకుతున్నారు. గంటావారిపాలెం దగ్గర సీఎం జగన్ను పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కలిశారు. పలువురు జనసేన, టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరీదేవి, రమేష్ కుమార్ రెడ్డితో పాటు జనసేనకు రాజీనామాకు చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర సొంతమాగులూరు క్రాస్ రోడ్డుకు చేరుకుంది. యాత్రకు జనం నీరాజనం పలికారు. అక్కడి నుంచి అన్నవరప్పాడు చేరుకున్న ముఖ్యమంత్రి బస్సుయాత్రకు భారీ గజమాలతో స్వాగతం పలికారు స్థానికులు. బస్సుపైకి ఎక్కి వారికి అభివాదం చేశారు సీఎం జగన్. రొంపిచర్ల అడ్డరోడ్డు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్రకు పెద్ద ఎత్తును స్వాగతం పలుకుతున్ ప్రజానీకం. అక్కడి నుంచి బస్సు యాత్ర మర్రిచెట్టుపాలెంకు చేరుకుంది. ఆ తర్వాత అయ్యప్పనగర్లో జరుగుతున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన వైసీపీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

