Viral: ఓర్నీ.! భక్తితో గుడికొచ్చాడనుకుంటే.. దేవుడికే ఎసరు పెట్టాడు.. ఏం చేశాడో చూస్తే
అందరూ గుడికి ఎందుకొస్తారు.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.! దేవుడిని పూజించడానికి, లేదా తమ కోరికలు విన్నవించడానికి.. భక్తులు గుడికి క్యూ కడతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.!
తమ కోరికలు నేరవేర్చమని, లేదా చిన్న చిన్న కానుకలు దేవుడికి సమర్పించుకునేందుకు గుడికి వస్తుంటారు భక్తులు. కానీ ఈ కేటుగాడు కాస్త సెపరేటు.. అందరూ నడిచిన దారిలో నడవడు. గుడికి వచ్చిన ఇతడు.. పట్టుమని పదిహేను నిమిషాలు దేవుడికి మొక్కుకున్నాడు. కట్ చేస్తే.. ఆ తర్వాత ఏం చేశాడో చూస్తే మీరు షాక్ కావడం ఖాయం. వివరాల్లోకి వెళ్తే.. ఆంజనేయస్వామి వెండి కీరటాన్ని దొంగలించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వీడియో ప్రకారం.. ఓ దొంగ భక్తి కొద్దీ గుడిలో కీర్తనలు లాంటివి పాడుతున్నట్టు మీరు చూడవచ్చు. కానీ అదంతా కల్లబొల్లి నాటకమే.. సరైన సమయం చూసి గర్భగుడిలోకి వెళ్లి.. దేవుడి వెండి కీరటాన్ని ఎత్తుకెళ్లాడు దొంగ. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలలో రికార్డు కాగా.. క్షణాల్లో ఇంటర్నెట్లో వైరల్ అయింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్కు ఫిదా నెటిజన్లు

