Viral: ఓర్నీ.! భక్తితో గుడికొచ్చాడనుకుంటే.. దేవుడికే ఎసరు పెట్టాడు.. ఏం చేశాడో చూస్తే
అందరూ గుడికి ఎందుకొస్తారు.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకుంటున్నారా.! దేవుడిని పూజించడానికి, లేదా తమ కోరికలు విన్నవించడానికి.. భక్తులు గుడికి క్యూ కడతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.!
తమ కోరికలు నేరవేర్చమని, లేదా చిన్న చిన్న కానుకలు దేవుడికి సమర్పించుకునేందుకు గుడికి వస్తుంటారు భక్తులు. కానీ ఈ కేటుగాడు కాస్త సెపరేటు.. అందరూ నడిచిన దారిలో నడవడు. గుడికి వచ్చిన ఇతడు.. పట్టుమని పదిహేను నిమిషాలు దేవుడికి మొక్కుకున్నాడు. కట్ చేస్తే.. ఆ తర్వాత ఏం చేశాడో చూస్తే మీరు షాక్ కావడం ఖాయం. వివరాల్లోకి వెళ్తే.. ఆంజనేయస్వామి వెండి కీరటాన్ని దొంగలించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వీడియో ప్రకారం.. ఓ దొంగ భక్తి కొద్దీ గుడిలో కీర్తనలు లాంటివి పాడుతున్నట్టు మీరు చూడవచ్చు. కానీ అదంతా కల్లబొల్లి నాటకమే.. సరైన సమయం చూసి గర్భగుడిలోకి వెళ్లి.. దేవుడి వెండి కీరటాన్ని ఎత్తుకెళ్లాడు దొంగ. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలలో రికార్డు కాగా.. క్షణాల్లో ఇంటర్నెట్లో వైరల్ అయింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

