ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆఫీసుకు వెళ్తేనే..

ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆ భరోసానే వేరు. ఆఫీసుకు వెళ్లకపోయినా అడిగేవాళ్లుండరు.. సమయానికి జీతం వచ్చేస్తుంది. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ఓ గంట కుర్చలో కూర్చుని కునుకు తీసి వెళ్లిపోయినా సరిపోతుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ పప్పులేం ఉడకవ్‌ అంటోంది మణిపూర్‌ ప్రభుత్వం. అవును మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆఫీసుకు వెళ్తేనే..

|

Updated on: Mar 11, 2024 | 5:31 PM

ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆ భరోసానే వేరు. ఆఫీసుకు వెళ్లకపోయినా అడిగేవాళ్లుండరు.. సమయానికి జీతం వచ్చేస్తుంది. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ఓ గంట కుర్చలో కూర్చుని కునుకు తీసి వెళ్లిపోయినా సరిపోతుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ పప్పులేం ఉడకవ్‌ అంటోంది మణిపూర్‌ ప్రభుత్వం. అవును మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సరైన కారణం లేకుండా కార్యాలయాలకు డుమ్మా కొడుతుండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు బుధవారం సరికొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. అదేంటంటే.. ఎప్పుడంటే అప్పుడు డుమ్మాలు కొట్టే ప్రభుత్వ ఉద్యోగులకు నో వర్క్-నో పే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు శాతం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కానిపాకం వినాయకుడితో పోటీపడి పెరుగుతున్న శివుడు !! ఎక్కడంటే ??

8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం

కేరళ పాఠశాలలో తొలిసారి ఏఐ పంతులమ్మ పాఠాలు..

మొబైల్‌ గేమ్‌ ఆడుతున్న బాలుడు.. గదిలోకి ప్రవేశించిన చిరుత.. ఏం జరిగిందంటే ??

Weight Loss: ఇలా చేస్తే నిద్రలో కూడా ఈజీగా బరువు తగ్గుతారు..

Follow us