అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్.. కేరళ సర్కారు కీలక నిర్ణయం
అయ్యప్ప దీక్షల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల వచ్చే అయ్యప్పస్వాములకు ఉచితంగా జీవిత బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఇవాళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ కీలక అంశంపై చర్చించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు శబరిమల యాత్ర సందర్భంగా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించనున్నారు.
అంతేకాదు, ఆ భక్తుడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది. అయ్యప్ప ఆలయంతో పాటు కేరళలోని దక్షిణ ప్రాంతంలోని అన్ని ఆలయాలను పర్యవేక్షించే ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు ఈ సరికొత్త బీమా పథకానికి ప్రీమియం చెల్లిస్తుంది. కాగా, రెండు నెలలకు పైగా కొనసాగే అయ్యప్ప స్వాముల దీక్షల నేపథ్యంలో… శబరిమల ఆలయం నవంబరు 16న తెరుచుకోనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోల్కత్తాలో బైక్ రైడ్ బుక్ చెయ్యడమే తప్పయ్యింది
Kanguva: కంగువ విడుదల డౌటేనా ??
4 ఏళ్లలో ఎయిర్ పోర్టుకు మెట్రో !! రెండో దశకు మరో ముందడుగు
Follow Us
వైరల్ వీడియోలు
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

