అంతరిక్షంలో భారత్‌ స్పేస్‌ స్టేషన్‌.. 2040 కల్లా పూర్తి చేసేలా సన్నాహాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2047వ సంవత్సరం నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో నూతనంగా మూడవ లాంచ్ పాడ్ నిర్మించండానికి స్థల సేకరణ ఏర్పాట్లలో ఇస్రో ఇప్పటికే నిమగ్నమైంది. దీంతోపాటుగా సరికొత్త రాకెట్ లాంచింగ్ వెహికల్, న్యూ జనరేషన్ రాకెట్ లాంచింగ్ వెహికల్ ఎన్ జీ ఆర్ ఎల్ వి 2035 నాటికి సిద్ధమయ్యే విధంగా ఇస్రో బడ్జెట్లను కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది.

అంతరిక్షంలో భారత్‌ స్పేస్‌ స్టేషన్‌.. 2040 కల్లా పూర్తి చేసేలా సన్నాహాలు

|

Updated on: Mar 19, 2024 | 7:48 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2047వ సంవత్సరం నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో నూతనంగా మూడవ లాంచ్ పాడ్ నిర్మించండానికి స్థల సేకరణ ఏర్పాట్లలో ఇస్రో ఇప్పటికే నిమగ్నమైంది. దీంతోపాటుగా సరికొత్త రాకెట్ లాంచింగ్ వెహికల్, న్యూ జనరేషన్ రాకెట్ లాంచింగ్ వెహికల్ ఎన్ జీ ఆర్ ఎల్ వి 2035 నాటికి సిద్ధమయ్యే విధంగా ఇస్రో బడ్జెట్లను కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ సోమనాధ్ 2047వ సంవత్సరం నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ను శ్రీహరికోటలో మూడో రాకెట్ లాంచ్ ప్యాడ్ నిర్మాణం,, న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ను సిద్ధం చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే 2028 న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ మొదటి టెస్ట్ వెహికల్ ను తాత్కా లిక ప్రయోగంగా ప్రయోగించనున్నారు. 2035 -47 సంవత్సరం నాటికి ఎన్ జీ ఆర్ ఎల్ వి లాంచ్ వెహికల్ ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఇస్రో కి అంకితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naga Chaitanya: ధూత సీక్వెల్‌కు రెడీ అంటోన్న నాగచైతన్య

కుక్కలకు పార్వో వైరస్.. మనుషులకు పొంచి ఉన్న ముప్పు

నెట్టింట చక్కర్లు కొడుతున్న మెగాస్టార్‌ టెన్త్‌ సర్టిఫికెట్‌.. పాసయ్యరా ??

అడుగు దూరంలో.. మూడో ప్రపంచ యుద్ధం

తీరని విషాదం.. అత్త మరణం తట్టుకోలేక ఆగిన కోడలు గుండె

Follow us