వారి ఖాతాల్లో లక్ష చొప్పున జమ.. రికవరీకి అధికారుల తంటాలు
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు జమలో గందరగోళం జరిగింది. కొందరు లబ్ధిదారుల ఖాతాల్లో అదనంగా రూ.లక్ష జమ అయినట్టు తెలుస్తోంది. మొత్తం 1,266 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.12.66 కోట్లు జమ చేశారు అధికారులు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దసరా పండగకు ముందు వివిధ దశలను పూర్తి చేసుకున్న పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమచేశారు.
ఈ క్రమంలో కొందరి ఖాతాల్లో అదనంగా రూ.లక్ష చొప్పున జమ అయ్యాయి. అనంతరం విషయాన్ని గుర్తించిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నగదు రికవరీ కోసం నానా తంటాలు పడుతున్నట్టు సమాచారం. భద్రాద్రి జిల్లాలో 157 మందికి..రంగారెడ్డిలో 119, నిజామాబాద్లో 91 మందికి నగదు జమ అయినట్టు తెలుస్తోంది. కాగా, కొంతమంది నుంచి అధికారులు ఇప్పటికే నగదు రాబట్టినట్టు సమాచారం. మరోవైపు అదనంగా జమ అయిన డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంకర్లకు కూడా గృహనిర్మాణ శాఖ లేఖ రాసినట్లు సమాచారం. పలువురి ఖాతాల్లో రూ.లక్ష చొప్పున అదనంగా జమ అయిన మాట నిజమేనని.. సాంకేతిక లోపంతో పొరపాటు జరిగిందని, రికవరీ చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాజీ ఎమ్మెల్యే పేరుతో మాయలేడి అరాచకం
భారీ క్రేన్తో సహాయంతో ఆస్పత్రికి వ్యక్తి తరలింపు !! ఎందుకిలా చేశారో తెలుసా ??
NRI Marriages: అమెరికా పెళ్లి సంబంధాలపై తగ్గుతున్న మోజు
ఆ రెండు దగ్గు సిరప్లు బ్యాన్రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

