ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై అఘాయిత్యం.. ఆపై అమ్మేసిన పోలీసులు

తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై ఎస్సై సహచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను ఓ వ్యక్తికి విక్రయించడంతో అతడు కూడా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. హర్యానాలోని పల్వాల్‌లో జరిగిందీ దారుణం. మహిళను మూడు రోజులపాటు గదిలో బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై సహా ఏడుగురిపై కేసు నమోదైంది.

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై అఘాయిత్యం.. ఆపై అమ్మేసిన పోలీసులు

|

Updated on: Sep 07, 2023 | 9:40 AM

తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై ఎస్సై సహచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను ఓ వ్యక్తికి విక్రయించడంతో అతడు కూడా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. హర్యానాలోని పల్వాల్‌లో జరిగిందీ దారుణం. మహిళను మూడు రోజులపాటు గదిలో బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై సహా ఏడుగురిపై కేసు నమోదైంది. నిందితుల్లో ఒకడి ఫోన్‌ను దొరకబుచ్చుకుని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని రక్షించిన పోలీసులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. జులై 23న హసన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆమె ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించిన ఎస్సై శివ్ చరణ్.. తన సహచరుడు బాలితో కలిసి సమీపంలోని పొలానికి వెళ్లాలని బెదిరించాడు. అక్కడ అప్పటికే నిరంజన్, భీమా అనే మరో ఇద్దరు వేచి చూస్తున్నారు. అక్కడామెపై అత్యాచారానికి పాల్పడిన వారు ఆ ఘటనను వీడియో తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించి పల్వాల్‌లో శాంతి అనే మహిళ ఇంటికి తీసుకెళ్లారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ఫోన్.. యువకుడి దుర్మరణం

తిరుమల శ్రీవారి సేవలో షారుఖ్‌ఖాన్‌, నయనతార

అక్కడ కరెంట్ బిల్లు కట్టడానికి జీతాలు కూడా సరిపోవడం లేదట

ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ రంగులో ఉల్కపాతం..

గోదారోళ్ల వినూత్న పెళ్లి.. అమ్మాయిలు చీరకట్టులో బుల్లెట్ బైకులపై సందడి

Follow us